సమస్తే తెలంగాణ, ఆగస్టు 15 ;స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ఎస్.రా జేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో హరిచందన, ఎ స్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ భరత్ జెండా ఎగుర వేశారు. జాతీయ నాయకుల చిత్రపటాల వద్ద కొబ్బరి కా యలు కొట్టి పూజలు చేశారు. స్వతంత్ర పోరాటంలో అ సువులు బాసిన దేశ నాయకులకు జేజేలు పలుకుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు.
విద్యార్థులు గ్రామాల్లో పురవీధుల గుండా జాతీయ జెండాలతో తిరుగడంతో రోడ్ల్లన్నీ త్రివర్ణశోభితంగా మా రాయి. భారత్ మాతాకీ జై.. గాంధీజీకీ జై… నేతాజీకీ జై… జై కిసాన్… జై జవాన్… జై తెలంగాణ అన్న నినాదాలతో జిల్లాకేంద్రం మార్మోగింది. అలాగే విద్యార్థులకు ప లు పోటీలు నిర్వహించి బహుమతులు, నోటుపుస్తకాలు అందజేశారు. ఎందరో వీరుల త్యాగం, ఆత్మబలిదానాల ఫలితంగా ప్రస్తుతం మనం స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామని, వాటి ఫలాలను భా వితరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పలువురు పిలుపుని చ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉ త్సాహంగా పాల్గొన్నారు.