ఆత్మకూరు, సెప్టెంబర్ 16 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్న ది. మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉద యం 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదుకాగా, 28 గేట్లతో నీటిని విడుదల చేశారు. మ ధ్యాహ్నానికి 2.12 లక్షల క్యూసెక్కులకు పైగా న మోదుకాగా, రాత్రికి 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోకు చేరుకున్నది. 23 గేట్లు ఎత్తి 1,57, 343 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 800, నెట్టెంపాడు లిఫ్ట్కు 750, భీమా -2కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.145 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి 1,86,486 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా, విద్యుదుత్పత్తికి 26,056 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో 3.177 మి.యూ. ఉత్పత్తి చేశారు. దీంతో ఇప్పటి వరకు 187.230 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. దిగువ జూ రాలలో 6 యూనిట్లలో ఒక్క రోజే 4.472 మి. యూ. విద్యుదుత్పత్తి చేయగా, మొత్తంగా 173. 089 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. వ రద ఇదేవిధంగా కొనసాగితే వారంలో 200 మి.యూ. మార్కు చేరుకుంటామని ఎస్ఈ జ యరాం తెలిపారు. మరో మూడ్రోజులు స్థిరంగా వరద కొనసాగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
తుంగభద్ర డ్యాంకు వరద
అయిజ, సెప్టెంబర్ 16 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. 12 గేట్లు రెం డు అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం డ్యాంలో 50,393 క్యూసెక్కులు ఇ న్ఫ్లో, 52,393 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.393 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగులకుగానూ 1632.82 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి వరద నీటి ని దిగువకు విడుదల చేస్తుండడంతోపాటు వర్ష పు నీరు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుతున్నది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు 22,484 క్యూసెక్కు లు ఇన్ఫ్లో ఉండగా, 22,050 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.8 అడుగుల మేర నీటి మట్టం ఉండగా, ప్రధానకాల్వకు 434 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం, సెప్టెంబర్ 16 : ఎగువ నుంచి శ్రీశై లం ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి చేరుతున్నది. జూరాల గేట్ల నుంచి 1.57 లక్షలు, పవర్హౌస్ నుంచి 26,056, సుంకేసుల నుంచి 42,420 క్యూసెక్కులు విడుదల చేశారు. కాగా, గురువా రం రాత్రి ప్రాజెక్టుకు 2,20,680 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ఐదు గేట్లు పది అ డుగుల మేర ఎత్తి 1,39,915 క్యూసెక్కులు విడుదల చేశారు. ఏపీ పవర్హౌస్కు 27,297, టీఎస్ పవర్హౌస్కు 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి ని ల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.8450 టీఎంసీలు నిల్వ ఉన్నది.