జోగులాంబ గద్వాల : గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం సీఎం కేసీఆర్ లక్షా నూట పదహారు రూపాయలు పెళ్లికి కానుకగా అందజేస్తూ అండగా నిలిస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నజూమన్నీసా బేగం, జెడ్పీటీసీ పద్మ, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచులు బండ్ల జ్యోతి, సూజాత, పద్మ, గణపతి, ఎంపీటీసీ దేవన్న, మండల మహిళ అధ్యక్షురాలు సుజాత, మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు అబ్రహం తదితరులు పాల్గొన్నారు.