జోగులాంబ గద్వాల : గత ప్రభుత్వాలు సంచార జాతులను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంచారజాతులను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని గద్వాల మ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీలో సంచారజాతుల, నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నాయీ బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ సెలూన్ షాపులకు 250 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నారని తెలిపారు. గద్వాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిందన్నారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో గద్వాల నియోజకవర్గం అభివృద్ధికీ కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రామేశ్వరమ్మ , వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, జయమ్మ, మురళి గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.