గద్వాల: గద్వాల పట్టణ అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి రూ.1,95లక్షలతో గోన్పాడ్ దగ్గర నిర్మించిన, డంపింగ్ యార్డు, చింతలపేటలో నిర్మించిన వెకుంఠధామాన్ని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మ న్ బీఎస్ కేశవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామాలను నిర్మించారన్నారు.
గతంలో గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేస్తే అందులో చెత్త వేసేవారని దీంతో ఆ పరిసర ప్రాంతా ల్లోని ప్రజలు అనేక రకాల విష జ్వరాల భారిన పడి దవాఖానలకు వెళ్లేవారని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రామాలు, ప్టటణాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి స్వచ్ఛ తెలంగాణకు శ్రీకారం చుట్టి ప్రతి చెత్తను తరలించడానికి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్తో పాటు పట్టణాలకు ఆటోలు అందజేశారని చెప్పారు. ఇవి గ్రామాలు, పట్టణా లలోని చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నాయని చెప్పారు.
దీని వల్ల గ్రామాలతో పాటు పట్టణాలు పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో పాటు వార్డుల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి ఇంటికి రెండు బుట్టలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అందజేశారన్నారు. ఇండ్లలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి అక్కడ చెత్తను, ప్లాస్టిక్ వస్తువులను వేరు చేస్తారన్నారు. చెత్త ద్వారా ఎరువు తయారు చేసి వ్యవసాయం, హరితహారం మొక్కలకు అందజేస్తారన్నారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. భవిష్యత్లో గద్వాల పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజ మ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ,ఎంపీపీలు ప్రతాప్గౌడ్, విజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, సర్పం చ్ మజీద్, కౌన్సిలర్లు మురళీ, నాగిరెడ్డి, కృష్ణ, మహేశ్,శ్రీను, నాయకులు రమేశ్ నాయిడు, గోవింద్, వంశీ పాల్గొన్నారు