గద్వాల: తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పేదలు అనారోగ్యానికి గురైతే సరైన చికిత్స చేయించుకోలేని వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అంది స్తుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పొందిన వారిలో జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన శారదమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష, లక్ష్మీనందకుమార్కు రూ.49,000, శ్రీని వాసులుకు రూ.36,000 చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, కౌన్సి లర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి, శ్రీనివాసులు, కృష్ణ, నాయకులు రామకృష్ణ శెట్టి, సాయి శ్యాంరెడ్డి, రిజ్వాన్, రాము తదితరులు పాల్గొన్నారు.