గద్వాల: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన కృష్ణన్న అనారోగ్యంతో మరణించ గా ప్రభుత్వం నుంచి మంజూరైన రైతు బీమా రూ.5లక్షల చెక్కును ఆయన భార్య లక్ష్మికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సాయాన్ని రైతు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతు సంక్షే మమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి,జాన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం
ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో కుంగ్పూ కరాటేలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ క్రీడాకారులు మున్ముందు మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొ ని గద్వాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.