జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వం పంపిణీ చేసిన క్రిస్మస్ కానుకలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవ సోదరుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
గద్వాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో చర్చి దగ్గర నిరుపేద కుటుంబాలు వివాహాలు, శుభకార్యాలు జరుపుకోవడానికి ఫంక్షన్ హాళ్లు కేటాయించామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ మహేష్, మురళి, నాగిరెడ్డి, శ్రీమన్నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.