జోగులాంబ గద్వాల : పాలకులు చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి జీవనాన్ని కొనసాగించేవారు. సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆదివారం చేనేత కార్మికులకు చేనేత బీమా ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.
నేతన్నల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు కేసీఆర్, చేనేత కార్మికులకు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గద్వాల పట్టుచీరai ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం గద్వాల నుంచి చేనేత కార్మికులు నిష్టతో స్వామివారి పంచెను తయారుచేసి శ్రీవారికి సమర్పిస్తారన్నారు.
18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల గల వారికి, అనుకోకుండా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేనేత బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు వారం రోజుల్లో నామినికి అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, తదితరులు పాల్గొన్నారు.