జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే… ఒడిషా రాష్ట్రానికి చెందిన సరోజ్ (21) గద్వాలలోని శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్లో సర్వర్గా పని చేస్తున్నాడు. భీంనగర్లో ఓ ఇంటిలో నివసిస్తున్న సరోజ్ బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని స్నేహితులు కిటికిలోంచి చూడ గా విగత జీవిగా కన్పించాడు. సమాచారం అందుకున్న గద్వాల టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.