న్యూడ్ కాల్స్ న్యూసెన్స్ చేస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు అశ్లీల ఇమేజ్లు, వీడియోలు తీసి దందా కొనసాగిస్తున్నారు. యువతులు, మహిళలకు వలపు వల విసిరి మగువల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొందరు ప్రేమ పేరుతో యువతులను మాయదారోళ్లు ట్రాప్ చేస్తుండగా.. మరికొందరు పేద మహిళలను టార్గెట్ చేసి డబ్బుల ఆశ చూపించి మోసం చేస్తున్నారు. మాకు తెలిసిన గురూజీ ఉన్నారు.. మీ ఫొటోలు పంపాలని చెబుతారు. ఆ తర్వాత పూజ కోసం మీ ఫొటోను గురూజీ సెలక్ట్ చేశారు.. నగ్న ఫొటోలు పంపిస్తే పూజ చేస్తామని, మీకు రూ.కోట్లు వస్తాయని నమ్మబలుకుతారు. దీంతో అమాయక మహిళలు వారికి ఫొటోలు పంపుతున్నారు. తర్వాత వాటిని వారు మార్ఫింగ్ చేస్తున్నారు. బాధితులు ఎవరైనా నిలదీస్తే మీ ఫొటోలను సోషల్మీడియాలో పెడ్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జోగుళాంబ గద్వాలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఇటీవల జడ్చర్లలో ఓ మహిళ ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇలా గుట్టుగా సాగుతున్న దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 30 మంది వరకు మోసపోయినట్లు సమాచారం. నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
జడ్చర్లటౌన్, మార్చి 9 : నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్రేమ పేరుతో మాయమాటలు చెబుతూ.. మరోవైపు పేద మహిళలను టార్గెట్ చేసుకొని డబ్బుల ఆశ చూపిస్తూ అశ్లీల ఫొటోలను తీసి అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. న్యూడ్ కేటుగాళ్ల మోసపూరిత దందాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా యి. ఇటీవల గద్వాల, జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటనలే ఇం దుకు నిదర్శనం. ప్రధానంగా 18 నుంచి 30 ఏండ్లలోపు ఉన్న యువతులు, మహిళలను టార్గెట్ చేస్తున్నారు.
సమాజంలో మం చి వ్యక్తులుగా నటిస్తూనే ఇలాంటి దందాకు తెరలేపుతున్నారు. మాయమాటలతో మహిళలను నమ్మించి ట్రాప్లో పడేస్తున్నారు. బాధితులు గమనించి నిలదీస్తే ఫొటోలను సోషల్మీడియాలో పెడుతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీంతో పరువుపోతుంద న్న భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. రెండు, మూ డు నెలలుగా జడ్చర్లలో గుట్టుగా సాగుతున్న ఈ దందాపై ఓ మ హిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ, అప్పటికే వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది మహిళలు న్యూడ్కేటుగాళ్ల చేతిలో మోసపోయినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు పట్టుబడితే అసలు బండారం బయటపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. న్యూడ్ఫొటోలను ఎవరికి చేరవేస్తున్నారు..? వా టితో ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నారన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.
నిరుపేద మహిళలే టార్గెట్..
జడ్చర్లలో వెలుగుచూసిన న్యూడ్ఫొటోల వ్యవహారంలో ప్ర ధానంగా పేద మహిళలను టార్గెట్ చేసినట్లు తెలుస్తున్నది. మొదటగా పేదలు నివసించే బస్తీల్లో న్యూడ్కేటుగాళ్లు నివాసాన్ని ఏ ర్పర్చుకొని, అమాయకంగా నటిస్తూ చుట్టుపక్కల మహిళలతో పరిచయం చేసుకుంటున్నారు. ఆ తర్వాత మహిళల ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేలా చేస్తామంటూ నమ్మబలుకుతారు. ‘మాకు తెలిసిన గురూజీ ఉన్నారు. మీ ఫొటోను సెల్ఫోన్లో పంపిస్తే అధిక మొత్తంలో డబ్బులు వచ్చేలా పూజలు చేస్తాడు’ అని నమ్మిస్తారు. దీంతో మహిళలు మొదటగా దుస్తులపై ఉన్న ఫొటోలు ఇస్తున్నారు. వారం తర్వాత ‘గురూజీ మీ ఫొటోను చూసి పూజ కోసం ఎంపిక చేశారు. ఇ ప్పుడు శారీరక శరీరాక సైజు, పుట్టుమచ్చలు కనిపించేలా న గ్నంగా ఫొటో దిగి పంపించాలి. పుట్టుమచ్చలు చూసి తాంత్రిక పూజలు చేస్తాడు. ఇక మీకు రూ.కోట్లు వచ్చిపడుతాయి’ అని నమ్మించి నగ్న ఫొటోలు తీసుకుంటున్నారు.
ఈ విధంగా తీసిన అశ్లీల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇతరులకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇలా ఒకరి నుంచి మరొకరి ద్వా రా దందాను కొనసాగిస్తున్నారు. బాధిత మహిళల్లో ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే మీ ఫొటోలను సోషల్మీడియాలో పెడుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పరువుపోతుందన్న భయంతో బాధిత మహిళలు ఎవరికీ చెప్పుకోలేక మనోవేదన చెందుతున్నారు. ఈ విధంగా జడ్చర్ల పట్టణంలోని పాతబజార్లో నివాసం ఉంటున్న జైనులాబోద్దీన్ కొన్ని నెలలుగా హై దరాబాద్లో ఉన్న గురూజీతో మంత్రాలు, తంత్రాలు చేయిస్తా.. మీకు డబ్బులు వస్తాయని మహిళలను నమ్మించి.. ముగ్గురు వ్య క్తులతో కలిసి న్యూడ్ ఫొటోల దందాను కొనసాగించాడు. ఈ క్రమంలో ఓ మహిళ ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారించి దందా నడుపుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
శిక్షలు కఠినంగా ఉండాలి..
ఆడవారి ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉండేందుకు పోలీసుశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేసేలా భరోసా కల్పించాలి. న్యూడ్ ఫొటోలు తీసిన వారిపై పోక్సో వంటి కేసులు నమోదుచేయాలి. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి కఠినమైన శిక్షలు పడేలా చూడాలి. మహిళలు వ్యక్తిగత ఫొటోలు, వివరాలను అపరిచిత వ్యక్తులకు చెప్పొద్దు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించాలి.
– సాహితీరెడ్డి, న్యాయవాది, జడ్చర్ల
మాయమాటలను నమ్మొద్దు..
న్యూడ్ఫొటోల బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం. స్మార్ట్ఫోన్లతో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులు వారి మాటలను నమ్మి మోసపోతున్నారు. మోసగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తదితర సమాచారం ఇవ్వొద్దు. ఫిర్యాదు చేసే బాధితుల పేర్లు రహస్యంగా ఉంచుతాం. ధైర్యంగా ముందుకొచ్చి తమకు సమాచారం ఇస్తే అండగా నిలబడుతాం. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తాం.
– రమేశ్బాబు, జడ్చర్ల సీఐ