అయిజ, మార్చి 27 : కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా, మాన్వి తాలూకా, కుర్డ్ది గ్రామంలోని పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కుర్డి గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు కుటుంబంలో జరిగిన పెండ్లి కి వారి కుటుంబ సభ్యులు కర్నూల్ జిల్లా కోస్గి మండలం, కందుకూరు గ్రామంలో జరిగిన పెండ్లి వేడుకలకు శుక్రవారం వెళ్లారు. పెండ్లి అనంతరం అగసనూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నది వద్దకు సరదాగా 20మంది స్నానానికి వెళ్లారు.
తుంగభద్ర న దికి నీటి ప్రవాహం పెరగడంతో స్నానానికి వెళ్లిన నలుగురు దాసరి ఉమావతి (28), దాసరి రత్నమ్మ (26), దాసరి మహంతేశ్ (20), దాసరి శివానంద్ (20)లు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో గల్లంతై మృత్యువాత పడ్డారు. అక్క డ ఉన్న స్థానికులు నలుగురిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో తుంగభద్ర నది ప్రాంతం విషాదంతో మునిగింది. కోస్గి మండలంలోని కందుకూరు.
మాన్వి తాలూకాలోని కురివి గ్రా మాల్లో రోదనలు మిన్నంటాయి. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ఈనెల 20వ తేదీ కేసీ కెనాల్ ఇం డెంట్ 4.7 టీఎంసీల నీటిని తుంగభద్ర జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతోనే ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగిందని కోస్గి మండల ప్రజలు పేర్కొంటున్నారు. తుంగభద్ర నదిలో నీటి మునిగి నలుగురు మృతి చెందిన ఘటనపై కోస్గి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.