తిమ్మాజిపేట, ఫిబ్రవరి 12 : పదేండ్లపాటు కా పాడుకున్న రాష్ట్ర హక్కులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేంద్రంలోని మోదీ సర్కారు కు ధారాదత్తం చేస్తున్నదని నాగర్కర్నూల్ మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. సోమవా రం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు ఉద్యమం చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులేనని గుర్తు చేశారు.
అదే తరహాలో కేంద్రానికి ప్రాజెక్ట్లు అప్పగించడంపై కోట్లాడుదామన్నా రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులు అప్పగిస్తూ సంతకాలు చేసిందన్నారు. దీంతో భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జి ల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అ దేవిధంగా సాగు, తాగునీరు, కరెంటుకు ఇబ్బందు లు వస్తాయన్నారు. ఇందుకోసం మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమానికి పిలుపు ఇచ్చారని, ఇందులో భా గంగా మంగళవారం నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు మండలం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు జోగు ప్రదీప్, బైకని శ్రీనివాస్, శ్రీనివాస్యాదవ్, వేణుగోపాల్గౌడ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.