బిజినేపల్లి, మే 2 : కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని.. పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని లింగసానిపల్లి, వసంతాపూర్, గంగారం, లట్టుపల్లి, మంగనూర్ గ్రామాల్లో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు.
మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి గోస పడొద్దన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, పులేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అల్లోజీ, మాధవరెడ్డి, లక్ష్మయ్య, శ్రీను, మహేశ్వర్రెడ్డి, బాలస్వామి, తిరుపతిరెడ్డి, విష్ణు, శేఖర్రెడ్డి, శ్రీను, నాగిరెడ్డి పాల్గొన్నారు.