నాగర్కర్నూల్, ఏప్రిల్ 7: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి మన బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ యువజన-సోషల్ మీడియా సభ్యుల సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ పార్లమెంట్లో బల్లలు గుద్దే వాళ్లు కా వాలా, ప్రశ్నించే వాళ్లు కావాలా ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. పార్లమెంట్లో మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేందుకు ప్రవీణ్కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
నాగర్కర్నూల్లో గెలిచేది కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని, రాబో యే ఎ న్నికల్లో యువకులందరూ కష్టపడి పనిచేయా లన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసాలను సోషల్ మీ డి యా వేదికగా ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్, బీ జేపీ తప్పుడు నిర్ణయాలను ప్రజలకు వివరించాలన్నారు. యువకులను, మన సోషల్ మీడియా స భ్యులను పోలీస్ అధికారులు ఎవరైనా ఇబ్బందుల కు గురి చేస్తే సహించమన్నారు. తెలంగాణలో ఈ రోజు రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, టైంకు క రెంట్, సాగునీరు లేక పంటలు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు, రైతులు మా ర్పు కోరుకుంటున్నారని, వాళ్ల జీవితాల్లో మార్పు లు వస్తాయని రైతులు అనుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని, అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చే యకుండా మోసం చేసిన కాంగ్రెస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంగా పెట్టుకుంటున్నారని, వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చిందనేది గుర్తించుకోవాలన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రై తుల ఉసురు పోసుకుంటోందని, వీటిపై పార్లమెంట్లో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్కు బలమివ్వాలని, అందుకు ప్రశ్నించే గొంతును గెలిపించంచాలని కో రారు. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడిన బీఆర్ఎస్కు ఓటేయాలని అభ్యర్థించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని, పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నీళ్లు రావడం లేదు, కేసీఆర్ కిట్ అం దడం లేదు. అన్ని వర్గాలను కాంగ్రెస్ కష్టాలపాలు చేసిందన్నారు.
బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్ ధ రలు పెరిగాయని ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లే దని, కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, దేవుడితోపేరుతో రాజకీయాలు చేయడం కాదు, చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సూచించారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని, అవసరమైతే మా ప్రా ణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటామన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా సభ్యులున్నారు.