మహబూబ్నగర్ అర్బన్, మార్చి 3 : కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఇబ్బందులతో పంట పొలాలకు నీరులేక నారుమడులు ఎండిపోతున్నాయని, రైతులు నీటిని ట్యాంకర్లతో తెచ్చి పంటలు కాపా డుకొనే పరిస్థితి ఏర్పడిందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హన్వాడ మండల బీఆర్ఎస్ నాయకు లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైదని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఇప్పుడున్న ప్రభుత్వంలో వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు కూడా రావడం లేదని, సమస్యలు తిష్ట వేశాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగితే ప్రజ లు నిలదీసే పరిస్థితులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ కోసం కష్టపడి పని చేసేవారికి మంచి భవిష్యత్ ఉం టుందని వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టినా ఎవరూ భయపడవద్దని న్యాయపరంగా ముందుకు పోదామన్నారు. రాను న్న పార్లమెంట్, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, అం దుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హన్వాడ ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు లక్ష్మయ్య, రమణారె డ్డి, బాలయ్య, కృష్ణయ్యగౌడ్, నరేందర్, శేఖర్, చె న్నయ్య, వెంకటయ్య, జంబులయ్య తదితరులు పా ల్గొన్నారు.