పెద్దమందడి, జూలై 18 : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడితోపాటు మండలంలోని చిలకటోనిపల్లి, బలీద్పల్లి, వెల్టూరు, మద్దిగట్ల, మోజర్ల, చిన్నమందడి, జగత్పల్లిలో కొనసాగుతున్న సర్ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. చిలకటోనిపల్లిలో సర్ వందశాతం పూర్తి కావడంతో బీఎల్వోలను మాజీ మంత్రి సన్మానించా రు.
గ్రామం ఆదర్శంగా నిలిచిందని, పూర్తి చేయడానికి కృషి చేసిన సర్పంచ్ అశ్వితా రమేశ్, బీఎల్వో మంజుల, బీఆర్ఎస్ బీఎల్ఏలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సం క్షేమ పాలన రావాలంటే ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా సాగాలన్నారు. గ్రామంలో 383 ఓటర్ల వివరాలకు వంద శాతం ఆన్లైన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పల్లెను ఆదర్శంగా తీసుకొని ఓట రు జాబితా సవరణను పూర్తి చేసి ప్రజాస్వామ్య స్ఫూ ర్తికి నాంది పలకాలన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం సర్లో పాల్గొంటూనే ప్రజాక్షేత్రంలో సమస్యలు గుర్తించాలని సూచించారు. ఆయన వెం ట బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్, జగదీశ్వర్రెడ్డి, రఘుపతిరెడ్డి, వేణుయాదవ్, కుమార్యాదవ్, అశోక్, సేనాపతి, పురుషోత్తంరెడ్డి, కురుమూర్తి, శ్రీనివాసులు, మొగిలయ్య, వెంకటన్న, ఆంజనేయులు, నర్సింహ, హనుమంతు, బాల్రెడ్డి, చిన్న రాములు, బీఎల్ఏలు ముని, రమేశ్, రాములు, తారాదేవి, శ్రీ నివాస్గౌడ్, శంకర్గౌడ్, ఆంజనేయులు, శంకర య్య, బాబు, రామకృష్ణ, కొండన్న ఉన్నారు.