ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 28 : ఎంపీ ఎన్నికలు.. పదేండ్ల తెలంగాణ పాలనలో జరిగిన నిజమైన అభివృద్ధికి, వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పాలనకు మధ్య జరుగుతున్నవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్ర వీణ్కుమార్కు మద్దతుగా ఖిల్లాఘణపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కేంద్రం లో మోదీ, రాష్ట్రంలో కేడీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణను సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ రా ష్ర్టాన్ని కన్నబిడ్డలాగా సాదితే.. కాంగ్రెస్ మోసపూరి త హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, మహిళ లు, నిరుద్యోగులు, పారిశ్రామిక వర్గాలను అరిగోస పెడుతుంటే సహించలేక 70 ఏండ్ల వయసులో, ఎ ర్రటి ఎండలో పోరుబాట పట్టిన గొప్పనేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. వారిని నమ్ముకుంటే మళ్లీ మో సపోతామని, కరువు తెచ్చిన పార్టీకి పార్లమెంట్ ఎ న్నికలో కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుకైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించి పార్లమెంట్కు పంపుదామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు, కా ర్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.