జడ్చర్లటౌన్, జూలై 18 : సర్ కార్యక్ర మంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని నివాసంలో మాజీ మంత్రి తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి బీఎల్వోకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్వోలు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలన్నారు.
ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నా ఓటు- నాహక్కు అనే భావనతో ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో అదనపు తాసీల్దార్ అజయ్కుమార్, బీఎల్వో సునీత, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మురళి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.