మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇస్తూ మోసం చేసిన కాంగ్రెస్ విధానాలపై భగ్గుమన్న ఆయన మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాజకీయ చతురతకు మారుపేరుగా నిలిచిన సీనియర్ నేత గులాబీ గూటికి చేరడంతో కందనూలులో హ్యాట్రిక్ విజయం ఖాయం కానుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గెలుపు ఇక నల్లేరుపై నడకగా మారనున్నది. నాగంతో కలిసి నడిచేందుకు సిద్ధమని, ఆయన అనుచరులను తన సోదరుల్లా భావిస్తానని ఎమ్మెల్యే మర్రి స్పష్టం చేసిన విషయం విదితమే. నాగం బీఆర్ఎస్లో చేరకుండా చివరిదాకా ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఈ నిర్ణయం అశనిపాతంలా మారింది. నాగం ‘కారు’ ఎక్కడంతో కాంగ్రెస్లో నిస్తేజం నెలకొనగా.. గులాబీ పార్టీలో జోష్ నెలకొన్నది.
నాగర్కర్నూల్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి డాక్టర్ నా గం జనార్ధన్ రెఢ్డి బీఆర్ఎస్లో చేరడం తో నాగర్కర్నూల్ నియోజకవర్గ బీఆర్ఎస్లో జోష్ నెలకొంది. సీనియర్ రాజకీయ నాయకుడిగా, వ్యూహ చతురతకు మారుపేరుగా నిలిచిన నాగం వాస్తవాల ను గుర్తించి ఎట్టకేలకు తెలంగాణ అభివృద్ధిలో సీఎం కేసీఆర్తో కలిసి నడిచేందుకు నిర్ణయించడం విశేషం. శాసనసభ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ వ్యూహంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించనుంది. నాగం జనార్ధ న్ రెఢ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేస్తూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నూ ముందుండి వైద్యునిగానూ సేవ చేస్తూ ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయరంగంలోకి ప్రవేశించారు. నాగం 1948లో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం నాగపూర్లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటస్వామి, నారాయణమ్మలు. మూ డో తరగతి వరకు నాగపూర్లో, పీ యూసీ వరకు నాగర్కర్నూల్లో అభ్యసించి వైద్యవిద్యను ఉస్మానియాలో పూ ర్తి చేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు కల నాగం తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. తన పెళ్లి పత్రికలోనూ జై తెలంగాణ నినాదాన్ని ము ద్రించుకోవడం ఆయనకే చెల్లింది. అ లాంటి నాగం నాగర్కర్నూల్ నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా పదవుల కు వన్నె తీసుకొచ్చారు. వైద్యవిద్య పూర్తయ్యాక 1976లో నాగర్కర్నూల్లో వై ద్యుడిగా జీవితం ప్రారంభించారు. ది వంగత సీఎం ఎన్టీఆర్ పిలుపుతో 19 83లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి 52ఓట్ల స్వల్ప తేడాతో ఓటమితో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు.
కాగా 1985లో ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1989లో టిక్కెట్ దక్కక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1994లో మళ్లీ తెలుగుదేశంలో చేరి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో నెంబర్ టూగా రాజకీయాలను నడిపారు. ఇలా 1995నుంచి 2004వరకు వరుసగా నాగం నాగర్కర్నూల్ ఎమ్మెల్యేగా పని చేశారు. కాగా తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ నిర్ణయించడంతో చంద్రబాబును ధిక్కరించడంతో 2011లో పార్టీ నుంచి బహిష్కరించడంతో 2012లో తెలంగాణ నగారా సమితిని స్థాపించి ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం సాధించారు. నాటి పరిస్థితుల్లో తెలంగాణ సమితి నాగర్కర్నూల్ల్లో నిర్వహించిన సభ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి తెలంగాణ ఉద్యమానికి బలాన్ని తీసుకొచ్చింది. అయితే 2013లో మహబూబ్నగర్లో బీజేపీ తరపున ఎంపీగా, 2014లో కాంగ్రెస్ నుంచి నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పా ర్టీని బలోపేతం చేశారు. ఈ ఎన్నికల్లో నా గంకే టిక్కెట్ వస్తుందని భావించిన ఆ యన అనుచరులకు అవమానం జరిగిం ది. డబ్బుల సంచులకు బీఫాంలు అమ్ముకుంటూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెఢ్డి నాగంకు టిక్కెట్ ఇవ్వకుండా అప్పుడే పార్టీలోక వచ్చిన రాజేశ్ రెఢ్డికి టిక్కెట్ కేటాయించడం జరిగింది. దీంతో నాగం కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ఆ పార్టీకి సుదీర్ఘ రాజీనామా లేఖను విడుదల చేశారు. నియోజకవర్గంలో నాగంకు బలమైన క్యాడర్ ఉంది. వేలాది మంది అభిమానులు నాగంతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. కీలక నేత బీఆర్ఎస్లో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.