ఊట్కూర్, జూలై 30 : జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఆయా మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు రాత్రి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు, కుంటల్లో జలకళ సంతరించుకుంది. వ ర్షానికి ఊట్కూరు మండలంలోని మల్లేపల్లి ముక్కన్న చెరు వు, పగిడిమర్రి, అమీన్పూర్ వాగులు పూర్తిగా నిండి అలు గు పారుతున్నాయి. మండలంలోని పెద్ద వాగు వర్షం నీటి తో పొంగిపొర్లింది. భారీ వర్షానికి తోడు కర్ణాటక ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో సామనూర్, పగిడిమర్రి, ఇడ్లూర్ శంకరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద వాగు లు వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం ఉదయం నుంచి ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు ని లిచి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈక్రమంలోనే ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో ఊట్కూర్ పెద్ద చెరువు కు భారీగా నీరు చేరింది. మరో రెండు పెద్ద వానలు కురిస్తే మండలంలోని అన్ని గ్రామాల చెరువులు అలుగులు పారే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. భారీ వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు, కుంటలు నిండు కుండను తలపిస్తుండగా ఇప్పటికే వరి నారు మళ్లను పెంచిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని పగిడిమర్రి వాగును తాసిల్దార్ తిరుపతయ్య, ఎస్సై రాములు సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తోడు ఎగువ ప్రాం తం కర్ణాటక నుంచి సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. తెలంగాణ, కర్ణాటక నుంచి బారీగా వచ్చిన వరద నీటితో అధికారు లు అప్రమత్తమై శనివారం మధ్యా హ్నం ప్రాజెక్టుకు సంబంధించిన మొ త్తం 10 గేట్లకుగానూ 6 గేట్లను ఎత్తి వే శారు. కాగా, జిల్లాలోనే మక్తల్ మండలంలో అత్యధికంగా 88.0 మి. మీ వ ర్షపాతం నమోదు కాగా నియోజకవర్గంలోని కృష్ణ మండలంలో 58.8 మి. మీ, మాగనూర్లో 50.0 మి. మీ. ఊ ట్కూర్లో 44.8 మి.మీ వర్షం కురిసింది. మక్తల్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రాఘవేంద్ర కాలనీ, శబరి కాలనీ, ఎల్లమ్మకుంటలో వర్షపు నీటితోపాటు మురుగు నీ రు కలిసి ఇండ్లలో చేరాయి. మాగనూర్ మండలంలోని నే రడుగం, వర్కూర్, అడవి సత్యారం గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు వంతెనలపై నుంచి ప్రవహి స్తున్నది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచి ఆయా గ్రా మాల ప్రయాణికులు అవస్థలు పడ్డారు.