ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మృగశిరకార్తెను ఘనంగా నిర్వహించారు. తొలకరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పండుగ వేళ చేపలకు డిమాండ్ పెరిగింది. ఈ రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో పలు గ్రామాల్లో చెరువుల్లో పడుతుండగానే అక్కడికే వెళ్లి కొనుగోలు చేశారు.
మృగశిర కార్తె సందర్భంగా బుధవారం చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మహబూబ్నగర్ టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో వద్ద చేప మాంసం ప్రియులు చేపలను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు.