వనపర్తి : ధాన్యం కొనుగోళ్లలో (Grain Procurement) వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నా ( Farmers Protest ) నిర్వహించారు. గత పదేళ్ల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరుగగా కాంగ్రెస్ హయాంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.తాలు లేకుండా శుభ్రంగా ధాన్యం తూర్పు పట్టినా తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం అసలు ప్రభుత్వం కొంటుందా.. మిల్లర్లు ధాన్యం కొంటున్నారా గందరగోళ పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. అధికారులు రాగానే వారి వెంట పోలీసులను తీసుకువస్తారని తమ సమస్య చెప్పాలన్నా కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వం, అధికారులు నిలబడటం లేదని వాపోయారు. ఏ ఒక్క మిల్లు యజమాని కూడా అధికారుల మాటను ఖాతరు చేయడం లేదని వెల్లడించారు.