వనపర్తి/గోపాల్పేట/శ్రీరంగాపూర్, మార్చి 12 : రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం ప్రారంభించి ఆదివారం నాటికి 9 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నాయ కులు, రైతులతో కలిసి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మినీ ట్యాంక్ బండ్ (నల్లచెరువు) వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో, గోపాల్పేట్ మండ లం మున్ననూర్ పెద్ద చెరువువద్ద రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతియాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ రంగాపూర్ మండల కేంద్రంలోని చెరువులో రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు గౌడ్ నాయక్ ఆధ్వర్యంలో మహిళ లు దీపాలు వెలిగించి గంగమ్మకు హారతులిచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ గతంలో వర్షాలు లేక చెరువులన్నీ బీటలుగా మారుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన మిషన్ కాకతీయతో పూర్వ వైభవం సంతరించుకున్నాయని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి నేడు ఏ చెరువును చూసినా నీటితో కళకళ లాడుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆవుల రమేశ్, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్కుమార్, నాయకులు బీచుపల్లి యాదవ్, సూర్యవంశం గిరి, హేమంత్, బాలరాజు, నందిమల్ల సుబ్బు, శివ, మధులత, కొమ్ము లక్ష్మి, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు వెంకట్స్వామి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మహేశ్గౌడ్, కో ఆప్షన్ మెంబర్ ఆరీఫ్, నాయకుడు కురుముర్తి తదితరులు పాల్గొన్నారు.