మాగనూర్, ఏప్రిల్ 12 : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో సాగునీరు లే క పంటలు ఎండిపోతున్నా యి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు ఎండుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెల్లో అయితే పదెకరాల వరకు ఎండిపోయాయి. వరి పంటలు ఎండిపోయి ఎకరాకు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఈ యాసంగిలో సాగుకు పెట్టిన పెట్టుబడి నష్టపో యి అన్నదాతలు ఆర్థికంగా చితికిపోయారు. వరి సాగుకు ఎకరాకు కనీసం రూ.30వేల నుంచి రూ. 35వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతున్నది. కోత దశలో పంట ఎండిపోవడంతో, ఇతర ఖర్చులు మినహాయి స్తే ఎకరాకు రూ.25వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఒక సీజన్లోనే సాగునీళ్లు అందించకపోవడంతో ఇంత భారీ నష్టం వాటిల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాగనూరు మండలవ్యాప్తంగా 4,280 మంది రైతులు 9,746 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చెరువులు, బావులు, బోర్లలో జలం తగ్గింది. దీంతో దా దాపు మండల వ్యాప్తంగా వెయ్యి నుంచి 2వేల ఎకరాల మధ్య వరి పంటలు ఎండిపోయిన విషయం వాస్తవమే. ఈ విషయా న్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
వాగు పక్కనే రెండెకరాల 20 గుంటల్లో వరి పంట వేశాను. సాగునీరు అందక ఎకరం పంట ఎండిపోతే పశువుల మేతకు ఇచ్చిన. ఉన్న ఎకరానికి పక్క పొలాల రైతులు నీళ్లిస్తున్నరు. అవి కూడా తడికి సరిపోవడం లేదు. ఇక పంట చేతికి రాదని ఆశలు వదులుకున్న. నేను పెట్టిన పెట్టుబడి కలుపుకొని దాదాపు రూ.70వేల నష్టం వాటిల్లింది.
ప్రజాప్రతినిధులు సాగునీటిపై దృష్టి పెట్టి ఉంటే పంటలు ఎండకపోయేవి. రైతులు ఇంత నష్టపోయేవారు కాదు. పంటలు ఎండి న ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.