కేటీదొడ్డి, ఏప్రిల్ 9 : ఎనిమిదేండ్లు చింత లేకుండా సాగిన సాగు సంబురం నేడు ఎండిన పంటలతో రైతన్న కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నవి. ఉమ్మడి ధరూర్ మండలంలో కరువు తాండవం చేస్తున్నది. పదేండ్లలో వరిపంటను రైతులు సంబురంగా సాగు చేశారు. ఒక్కో రైతు పంటకాలంలో 200 నుంచి 300 సంచుల ధాన్యం పండించేవా రు. ఈ ఏడాది యాసంగి మాత్రం పంటలన్నీ ఎండిపోయాయి.
ఒక్క ఎకరాకు సుమారు రూ.30వేల వరకు పె ట్టుబడి పెట్టగా, కనీసం అవి కూడా రావడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు అంతో ఇంతో అండ గా నిలిచే పెట్టుబడి సాయానికి కూడా కాంగ్రెస్ సర్కారు ఎగనామం పెడుతుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కేటీదొడ్డి మండలంలో ఎండిన పంటల వివరాల పై వ్యవసాయ అధికారిని వివరాలు అడిగేందుకు సంప్రదించగా, ఎన్నికల విధుల్లో ఉన్నామని తెలిపారు.
కాల్వలు, చెరువుల్లో నీళ్లు లేక బోర్లన్నీ ఇంకిపోయా యి. ఎనిమిదేండ్లుగా కాల్వలకు నీరు వస్తుండటంతో భూ గర్భజలాలు పుష్కలంగా ఉండేవి. ప్రస్తుతం నీళ్లు లేకపోవడంతో చెరువులు ఎండి భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పంటలు కాపాడుకోవాలని కొందరు రైతులు అప్పు తెచ్చి మరీ బోర్లు వేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఇలాగే కొనసాగితే పాత రోజులు మళ్లీ వస్తాయని, వలసలు తప్పవని చర్చించుకుంటున్నారు.
సాగునీళ్లు లేక బోర్లలో నీళ్లు ఇంకిపోయినయ్. రైతుబంధు పైసలు కూడా పడలేదు. కాల్వపోంటి నీళ్లొస్తే మా పంట పం డేది. నీళ్లులేక పంటలు ఎండిపోయాయి. రైతుల పాలిట దేవుడు కేసీఆర్. ఆయన పాలనలో నీ ళ్లు, కరెంటుకు ఇబ్బంది లేకుం డే. కాంగ్రెస్ సర్కారొచ్చినంక క ష్టాలు మొదటికొచ్చినయి. పం టనష్టపోయిన రైతులకు పరిహారమియ్యాలె.
– అంజమ్మ, రైతు, ఉమిత్యాల, గద్వాల జిల్లా
కేసీఆర్ హయాంలో దర్జాగా బతికాం. సాగు, తాగునీటికి చింతలేకుంటుండే. కాంగ్రెస్ వ చ్చినప్పటి నుంచి కరెంటు కష్టా లు మొదలయ్యాయి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను పట్టించుకుంటలేదు. రైతుబంధు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. కాల్వల్లో నీళ్లు లేక పంటలు ఎండుతున్నా యి. ఎండిన పంటలను అధికారులు కనీసం పరిశీలిస్తలేరు. ఇలాంటి వారిని ఇంకోసారి నమ్మం.
– మణెమ్మ, రైతు, ఉమిత్యాల, గద్వాల జిల్లా