‘చేతి’ని నమ్ముకుంటే చేటు తప్పదని కర్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు ‘హస్త’వ్యస్తంగా కొనసాగిన వారి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. మళ్లా ఇప్పుడేమో వ్యవసాయానికి 3 గంటల కరెంట్.. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటూ అక్కసు వెల్లగక్కడంపై రైతన్నలు భగ్గుమంటున్నారు. వ్యవసాయ రంగంపై రేవంత్ తొండాట ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్తో బంగారు పంటలు పండించి ఆర్థికంగా వృద్ధిలోకి వస్తుంటే చూసి ఓర్వలేక కడుపుమంటతో కుట్ర రాజకీయం చేయాలని చూస్తున్నారని కన్నెర్ర చేశారు. ఓటుతో వీరికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
మూడు గంటల కరెంటు, 10హెచ్పీ మోటర్లు అంటూ కాంగ్రెసోళ్లు సోయిలేని మాటలు మాట్లాడుతున్నరు. అసలు 24 గంటల కరెంటు ఇస్తే వారికి ఏం బాధ. మల్లా అధికారంలోకి వచ్చి మూడు గంటల కరెంటు ఇచ్చి రైతులను చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేద్దామని చూస్తున్నరు. కేసీఆర్ సారు వొచ్చినంక రాత్రిళ్లు పొలాలకు పోయే కష్టం తప్పింది. మాకు అవసరం వచ్చినప్పుడు పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నాం. 24గంటల కరెంటుతో రైతులు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారు. 10హెచ్పీ మోటార్లను రైతులు కొనాలంటే అయ్యేపనేనా. ఎద్దు, ఎవుసం తెలయనోడు ఎన్నైనా మాట్లాడుతడు. రైతుల కష్టాలు ఎరిగిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ సారే.
సీఎం కేసీఆర్ ఇస్తున్న 24గంటల కరెంటుతో మెట్టలు, గుట్టలు సైతం సాగు చేస్తున్నా. నిరంతర కరెంటుతో నా పొలమంతా పచ్చబడ్డది. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే చాలీచాలని 3గంటల కరెంటుతో నాకున్న ఐదెకరాల పొలంలో ఒక ఎకరా మాత్రమే సాగు చేసేవాడిని. అది ఆ పంట కూడా చేతికి వచ్చేదాకా నమ్మకం లేకుండేది. సీఎం కేసీఆర్ వచ్చినంక హాయిగా పంటలు పండించుకుంటున్నం. కడుపునిండా అన్నం తి ని, కంటి నిండా నిద్రపోతున్నాం. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే 3గంటల కరెంటుతో నరకం అనుభవించాం. పొలానికి వెళ్లి చూస్తే నెర్రలు బారిన పొలాలే కనిపించేవి. కరెంటు లేక పొలాల వద్ద నీరు తాగేందుకు కూడా దొరికేవి కావు. ఇంటి నుంచి డబ్బాలో తాగునీరు బోరు వద్దకు తీసుకెళ్లేవాళ్లం. ఇప్పడు పుష్కలమైన కరెంటు, నీరు కన్పిస్తోంది. పొలాలన్నీ పచ్చబడి సంతోషమనిపిస్తుంది. నాకున్న ఐదెకరాల్లో వరి పంట వేశాను. పంట దిగుబడి కూడా ఇప్పుడిప్పడే వచ్చింది. 24గంటల కరెంటు పుణ్యంతో నా పొలం పక్కనే ఉన్న వేరే పొలాన్ని కౌలుకు తీసుకొని 12ఎకరాలు బుడ్డల పంట వేశాను. నీరు, కరెంటు పుష్కలంగా ఉండటంతో నా పొలంలోనే పాంపాడ్ గుంత ఏర్పాటు చేసుకొని, అందులో నీరు నిల్వ చేసి బుడ్డ పంటకు పారిస్తున్నా. సీఎం కేసీఆర్ వొచ్చినంక నాలాంటి బక్క రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకలో 24గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక, 3గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నరు. రైతులెవరూ నమ్మొద్దు. మరోసారి కేసీఆర్ను గెలిపించుకుంటేనే 24గంటల కరెంటు ఉంటది.
కాంగ్రెస్ ఇస్తామంటున్న మూడు గంటల కరెంట్తో ఒక్క మడి కూడా తడవదు. గతం లో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. పొ లాల వద్ద పడుకొని విషపురుగుల కా టుకు ఎంతో మంది చినిపోయిండ్రు. కరెంట్ లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయి, వాటిని బాగు చేయించడానికి చాలా డబ్బులు ఖర్చుచేసేటోళ్లం. ఇ ప్పుడున్న మోటర్లు తీసేసి 10హెచ్పీ మోటర్లు పెడితే ఖర్చు ఎవరు భరిస్తారు. సీఎం కేసీఆర్ సారు వొచ్చినంక కరెంటుకు ఇబ్బందులేమీ లేవు. 24గంటల కరెంట్ ఇస్తున్నడు.రైతులకు 24గంటల కరెంట్ ఇస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారిం ది. నాకున్న ఐదెకరాల పొలంలో ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నా.
తెలంగాణ రాకముందు సేద్యం చేద్దామంటే ఎ న్నో పడుతూ చేసేటోళ్లం. రోజుకు ఆరుగంటలు మాత్రమే కరెంట్ వస్తుండే. ఒక వారం పగటి పూ ట, మరోవారం రాత్రి వేళల్లో కరెంట్ ఉండేది. పగలనక.. రేయనకా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎదురుచూసేవాళ్లం. ఒక్కో వారంలో రాత్రి 12 గంటలకు వచ్చేది. ఆ సమయంలో పాములు కాటేస్తాయో.. జీవరాశులు దాడులు చేస్తాయో, కరెంట్ షాక్ కొడుతుందో తెలియక చలికి వణుకుతూ పైపులు మార్చేటోళ్లం. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతులు పడుతున్న గోసచూసి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తుండు. కరెంట్ గురించి ఎదురుచూసేదే లేదు. ఏమైనా పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకొని చెలుకకు వెళ్లి పల్లీ చేనుకు నీళ్లు పెడుతున్నం. ఇప్పుడేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3గంటలే కరెంట్ ఇస్తామని రేవంత్రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఇంతకుముందు పడ్డ గోస మళ్లీ రైతులకు వస్తది. రైతులకు కష్టాలు తప్పవు.
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మితే రైతులు ఆగమైతరు. మన పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రైతులకు ఏం చేసింది. 5గంటల కరెంటు కూడా ఇస్తలేరు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుండ్రు. రేపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన గతి కూడా అలాగే తయారైతది. వ్యవసాయానికి 3గంటలు కరెంట్ సరిపోతుందని రేవంత్రెడ్డి చెబుతున్నడు. రైతులు బాధతు తెలిసినోడైతే ఆ మాటలు మాట్లాడుతడా. 10హెచ్పీ మోటర్లను బిగించుకోవాలని చెబుతున్నరు. బుద్ధి ఉన్నోడెవడైనా అంత పెద్ద మోటర్లు వాడుతారా. రైతులను ఆగం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. గిప్పుడిప్పుడే రైతులు నీళ్లు, కరెంటుకు ఢోకా లేకుండా మంచిగా సాగు చేస్తున్నరు. మళ్లా కాంగ్రెస్ పాలనొస్తే కరెంటు ఉండదు. నీళ్లు రావు. రైతులు బాగా ఆలోచించి ఓటు వేయాలే. లేదంటే మళ్లా ఆగమైతం.
చానా మంది రైతులు 5హెచ్పీ, 7.5 హెచ్పీ మోటర్లను ఎక్కువగా ఉపయోగిస్తుండ్రు. గీ మోటర్లు కాలిపోతే 5హెచ్పీ మోటర్కు రూ.2వేల నుంచి రూ.2,500 వరకు రిపేరుకు తీసుకుంటాం. 7.5 హెచ్పీ మోటర్ కాలిపోతే రూ.3,500ల వరకు రిపేరుకు పెట్టుకోవాల్సి వస్తుంది. గీవి కాకుండా అదనంగా పంపులో ఏమైనా రిపేరు ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. గిప్పుడు కరెంట్ నిరంతరం ఉండడంతో మోటర్లు ఎక్కువగా కాలిపోతలేవు. 10హెచ్పీ మోటర్లు పెట్టేంత అవసరం రైతులకు ఉండదు. నదులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 10 హెచ్పీ మోటర్లు ఉపయోగిస్తారని తెలుసు. మన ప్రాంతాల్లో 10హెచ్పీ మోటర్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. 10 హెచ్పీ మోటర్ బోర్లలో దింపితే 3ఇంచుల పైపులు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. భూమిలో నీరు కూడా అంత అధికంగా ఉండడం చాలా కష్టం. ఉన్న మోటర్లు మార్చి కొత్త మోటర్లు పెట్టాలంటే కుదరని పని.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ లేక భూములు బీడుగా పెట్టేటోళ్లం. లోఓట్టేజీతో మోటర్లు కాలిపోయి అనేక అవస్థలు పడ్డాం. వచ్చిపోయే కరెంటుతో పొలాల్లోనే పండుకోవాల్సి వచ్చేది. చీకట్లో పొలానికి వెళ్లి విషపురుగుల కాటుకు బలైనోళ్లు ఎంతోమంది ఉన్నరు. కేసీఆర్ ప్రభుత్వం వొచ్చినంక 24గంటల కరెంటు ఇస్తున్నడు. సాగునీరు కూడా తీసుకొచ్చారు. యేటా రెండు పంటలు పండించుకుంటున్నం. గతంలో ఎకరా పొలం నాటితే కరెంట్ సరిగా లేక సగం పొలం కూడా పంట వచ్చేది కాదు. ఇప్పుడు కావాల్సినంత కరెంట్, దుందుంబీ వాగులో చెక్ డ్యాంలు నిండి అనుకున్నదానికంటే అధికంగా పంటలు పండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు 3గంటలు కరెంట్ ఇస్తాం, బోర్లకు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమనడం వారి అవివేకానికి నిదర్శనం. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు కరెంట్ కోసం రోడేక్కడం ఖాయం.
గిప్పుడు కటుకేస్తే మస్తు నీళ్లొస్తున్నయి. 24గంటల కరెంట్ ఉంటున్నది కాబట్టే రైతు చింత లేకుండా ఎవుసం చేసుకుంటున్నడు. ఇగ కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తే సిచ్చు బోర్డు కాడనే కావలుండాలే. మళ్లీ పాత రోజులను తెస్తనని కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి అంటున్నడు. లేదు మీ బతుకులు బాగుచేస్తనని కేసీఆర్ అంటున్నడు. సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్, రైతు పథకాలతో రైతులను ఆదుకుంటున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3గంటల కరెంట్, 10హెచ్పీ మోటర్లంటూ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం గోసపడ్డాం. తెలంగాణ వొచ్చినంకనే సీఎం కేసీఆర్ సారు సాగును సంబురంగా మార్చిండు. నాకున్న 3ఎకరాల పొలంలో వరిచేను, పత్తి పండిస్తున్న. వ్యవసాయం మీద అవగాహన లేని కాంగ్రెస్ నాయకులకు రైతుల అవసరాల గురించి ఎలా తెలుస్తుంది. వారిని నమ్మితే నిండా మునుగుతాం. కేసీఆర్ సార్ ఉండంగ కాంగ్రెసోళ్లతో అక్కరే లేదు.