మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 21: జిల్లావ్యాప్తంగా మంగళవారం కంటివెలుగు శిబిరాల్లో 7,274మందికి పరీక్షలు చేసి 793మందికి దగ్గరి చూపు కండ్లద్దాలు అందజేసినట్లు డీఎంహెచ్వో కృష్ణ తెలిపారు. అదేవిధంగా 727మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,75,330మందికి పరీక్షలు చేయగా దగ్గరిచూపు సమస్య ఉన్న 3,08,307 మందికి కండ్లద్దాలు అందజేశారన్నారు. ప్రిస్కిప్షన్ అద్దాలను 2,06,779మందికి అందజేసినట్లు తె లిపారు. ఉగాది సందర్భంగా బుధవారం శిబిరాలు ఉండవన్నారు.
14,535మందికి కంటి పరీక్షలు
హన్వాడ, మార్చి 21: మండలంలో ఇప్పుటివరకు 14,535మందికి కంటిపరీక్షలు చేసినట్లు మండల వైద్యాధికారి ప్రగతి మంగళవారం తెలిపారు. ఇప్పుటివరకు 15గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమం పూర్తికాగా ప్రస్తుతం అత్యకుంటతండా, కోనగట్టుపల్లి, ఎల్లబాయితండాలో శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. వేపూర్లో 1,793, బుద్దారంలో 946, దోర్రితండాలో195, గోండ్యాలలో 1,226, హన్వాడలో 2,745, ఇబ్రహీంబాద్లో 936, కారంతండాలో 214, నాయినోనిపల్లిలో 896, పెద్దదర్పల్లిలో 874, పుల్పోనిపల్లిలో 405, రామన్నపల్లిలో 476, సల్లోనిపల్లిలో 646, షేక్పల్లిలో 616, టంకరలో 2,063, తిరుమలగిరిలో 505మందికి కంటిపరీక్షలు చేశామన్నారు. మొత్తం 14,535మందికి పరీక్షలు చేసి 2,370మందికి కండ్లద్దాలు ఇచ్చామన్నారు. ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు తప్పనిసారిగా చేయించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శిబిరాలకు సహకరించాలని కోరారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మార్చి 21 : మండలంలోని బోడజానం పేటలో మంగళవారం 130మందికి కంటి పరీక్షలు చేసి 19మందికి కండ్లద్దాలు ఇవ్వగా 37మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. సురారంలో 161మందికి పరీక్షలు చేసి 15మందికి కండ్లద్దాలు ఇవ్వగా, 11 మందికి ఆర్డర్ పెట్టినట్లు పేర్కొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 21 : మండలంలోని వాడ్యాల్లో 161మందికి పరీక్షలు చేసి 22మందికి అద్దాలు ఇవ్వగా 11మందికి ఆర్డర్ చేశారు. చిల్వేర్లో 198మందికి పరీక్షలు చేసి ఏడుగురికి అద్దాలు ఇ వ్వగా 11మందికి ఆర్డర్ పెట్టారు. కార్యక్రమంలో వైధ్యాధికారులు మనుప్రియ, కృష్ణకుమార్, వైద్య సిబ్బంది దేవయ్య, జంగయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మార్చి 21: కౌకుంట్ల మండ లం పేరూర్ పీహెచ్సీ పరిధిలోని గోపన్పల్లితోపాటు చిన్నచింతకుంట మండలం కురుమూర్తి, పల్లమర్రి గ్రామాల్లో మంగళవారం కంటివైద్య శిబిరాలు నిర్వహించారు. గోపన్పల్లిలో 158మందికి పరీక్షలు చేసి 19మందికి కండ్లద్దాలు ఇవ్వగా 41మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. కురుమూర్తిలో 165మందికి పరీక్షలు చేసి నలుగురికి అద్దాలు ఇవ్వగా ముగ్గురికి ఆర్డర్ చేశారు. పల్లమర్రిలోలో 202మందికి పరీక్షలు చేసి 29మందికి ఆద్దాలు ఇవ్వగా 68మంది కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో కంటివెలుగు అధికారులు డాక్టర్ సనా, సంతోష్, షఫీఖ్, వైద్యాధికారులు రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, శ్రీనివాసులు, కంటివైద్య నిపుణుడు ఖాదర్, సూపర్వైజర్ సుశీల, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, మార్చి 21: మండలంలోని కారుకొండ, దాయపంతులపల్లి, కూచూర్ గ్రామాల్లో మంగళవారం కంటివెలుగు శిబిరాలు నిర్వహించారు. కారుకొండలో 154మందికి కంటి పరీక్షలు చేసి 10మందికి కండ్లద్దాలు ఇచ్చారు. దాయపంతులపల్లిలో 167మందికి పరీక్షలు చేసి 15మం దికి కండ్లద్దాలు ఇవ్వగా 13మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కూచూర్లో 164మందికి పరీక్షలు చేసి 40మందికి అద్దాలు ఇవ్వగా 11మందికి అ ద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కార్యక్రమంలో వైద్యాధికారి విజయలక్ష్మి, వైద్య సిబ్బంది బీచుపల్లిగౌడ్, శరబలింగం, శ్రీనివాస్, అవినాశ్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల టౌన్, మార్చి 21 : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జడ్చర్ల మండలంలోని పోచమ్మగడ్డ తండాలో మంగళవారం 152మందికి పరీక్షలు చేసి 13మందికి కండ్లద్దాలు అందజేశారు. 16 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కొండేడు లో 151మందికి పరీక్షలు చేసి 15మందికి కండ్లద్దాలు పంపీణీ చేయగా మరో 15మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ సమత తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 9వ వార్డులో 171మందికి పరీక్షలు చేసి ఎనిమిదిమందికి కండ్లద్దాలు ఇవ్వగా ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 19వ వార్డులో 154మందికి పరీక్షలు చేసి 29మందికి కండ్లద్దాలు ఇవ్వగా మరో 24మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు ఆర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
దేవరకద్ర, మార్చి 21 : కంటివెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బస్వాపూర్ సర్పంచ్ హన్మంతు తెలిపారు. బస్వాపూర్లో శిబిరాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. శిబిరానికి ప్రజలు విధిగా ఆధార్కార్డు తీసుకొని రావాలని సూచించారు.