మహబూబ్నగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని జిల్లాకేంద్రమంతా గులాబీమయమైంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, ప్రధాన రహదారికి ఇరువైపులా గులాబీరంగు జెండాలు రెపరెపలాడుతుండగా ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా పరిశీలించారు. ఐటీ కారిడార్తోపాటు కేటీఆర్ పర్యటించే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలతో కలిసి శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసే లా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బహిరంగసభ ప్రాంగణాన్ని పరిశీలించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పించే ఐటీ కారిడార్ పాలమూరుకు రావడం మన అదృష్టమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఉదయం 11 గంటలకు ఐటీ కారిడార్ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌ డ్ ప్రారంభించి.. అక్కడే ఎనిమిది విదేశీ, స్వదేశీ కంపెనీలతో ఏంఓయూ కుదర్చుకుంటారు. అమరరాజా బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన అనం తరం పట్టణంలోని పలు జంక్షన్లను ప్రారంభించి సభలో పాల్గొంటారు.
రూ.100 కోట్లతో ఐటీ కారిడార్..
దివిటిపల్లి వద్ద రూ.100కోట్లతో నిర్మించిన ఐటీ కారిడార్ ఇండస్ట్రీయల్ పార్కు వద్దకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లు శనివారం ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. జాతీయ రహదారిని ఆనుకొని ఐటీ టవర్ వరకు నిర్మిస్తున్న 100ఫీట్ల నాలుగు లేన్ల రహదారిని పరిశీలించి ఐటీ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఎనిమిది కంపెనీలతో మంత్రులు ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఇందులో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ కూడా ఉన్నది.
అమరరాజా బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన
లిథియం బ్యాటరీని తయారు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అమరరాజా బ్యాటరీ కంపెనీకి దివిటిపల్లి ఐటీ కారిడార్లో 270 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అమరరాజా లిథియం సెల్ కంపెనీని ఇక్కడే నిర్మిస్తున్నారు. సుమారు పదివేలకోట్ల పెట్టుబడులతో సంస్థ ఇక్కడే కంపెనీని ప్రారంభించనున్నది. ఈ కంపెనీకి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమవుతారు. దే శంలో లిథియంతో తయారయ్యే మొట్టమొదటి బ్యాటరీ కంపెనీ ఇదే కావడం విశేషం.
రెండు జంక్షన్ల ప్రారంభం
పట్టణంలో ప్రధాన రహదారిపై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జంక్షన్ల విస్తరణ పనులను మంత్రులు ప్రారంభిస్తారు. న్యూటౌన్లోని నేతాజీ చౌరస్తాలో ఏర్పాటుచేసిన జంక్షన్ ఆకట్టుకుంటున్నది. పిల్లలు, పెద్దలు సెల్ఫీ దిగడంతోపాటు పైకి ఎక్కి వాటర్ఫాల్ను ఆస్వాదించే అవకాశం కల్పించనున్నారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న జంక్షన్లో పల్లెసుద్దులను తెలిపే మొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పెద్ద రాతిమీద కూర్చొని ప్రాచీన వాయిద్యాలతో జానపదాలను పాడుతున్నట్లు చిత్రీకరించారు. ఇక్కడ కూడా సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు జంక్షన్లను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
బాలుక కళాశాల మైదానంలో..
పాలమూరు జిల్లాప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనున్నారు. జిల్లాకేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలను తరలించాలని.. బీఆర్ఎస్ పట్టణ శాఖ, మండలంతోపాటు హన్వాడ మండలం నుంచి భారీగా జనాన్ని సమీకరించి సభను సక్సెస్ చేయాలని క్యాడర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు..
* ఉదయం 11 గంటలకు ఐటీ టవర్ ప్రారంభం
* ఎనిమిది కంపెనీలతో ఎంవోయూ
* అమరరాజా కంపెనీకి శంకుస్థాపన
* నేతాజీ చౌరస్తా ప్రారంభం
* బాలుర జూనియర్ కళాశాలలో బహిరంగ సభ
* భోజన విరామం
* అంబేద్కర్, వన్టౌన్ చౌరస్తా ప్రారంభం
* ట్యాంక్బండ్ వద్ద శిల్పారామం ప్రారంభం
* ఐలాండ్ సుందరీకణ పనులు ప్రారంభం
* కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీ ప్రారంభం
ఎంఓయూ కుదుర్చుకోనున్న కంపెనీలు..
1) ఐటీ విజన్ 360 2) జువెన్ టెక్నాలజీస్ ఐఎన్సీ 3) ఎగ్రోవ్ సిస్టమ్ 4) అర్పన్ టెక్ 5) ఫోర్ ఒకాస్ 6) మ్యులేర్ డాట్ నెక్ట్ 7) ఇన్ట్యుట్స్ 8) బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్