నాగర్కర్నూల్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది. హైదరాబాద్లో 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ఉండనున్నది. మార్చి 13న ఎన్నికలు జరగనుండగా.. 16న లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా గత 2017లో అధికార బీఆర్ఎస్ మద్దుతో కాటేపల్లి జనార్దన్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ బలపర్చడంతో ఎన్నికల్లో సులువుగా కాటేపల్లి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. విజయానికి 9,670 ఓట్లు అవసరం కాగా 11వ రౌండ్లో 9,734 ఓట్లు లభించడంతో మాణిక్రెడ్డిపై సునాయసంగా రెండోసారి కాటేపల్లి జయకేతనం ఎగురవేశారు. ఈ క్రమంలో వచ్చే-2023, మార్చి-29వ తేదీతో కాటేపల్లి పదవీకాలం ముగియనున్నది. దీంతో మరోసారి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబర్, నవంబర్లో కొత్తగా ఉపాధ్యాయ ఓట్ల నమోదును చేపట్టింది.
2016 నవంబర్ ఒకటి నుంచి 2022 అక్టోబర్ 31వ తేదీ మధ్యకాలంలో మూడేండ్లపాటు పాఠశాలలు, కళాశాలల్లో పని చేసిన ఉపాధ్యాయులకు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 4,500 ఓట్లు, ఉమ్మడి మహబూబ్నగర్ 8 వేలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 12 వేల ఓట్లు ఉన్నాయి. అయితే ఈకాలంలో కొత్తగా ఉపాధాయులు విధుల్లో చేరడం, గతంలో ఉన్న ఉపాధ్యాయ ఓటర్లు మృతి చెందడం, ఇతర ఉద్యోగాల్లోకి చేరడంతో కొత్త ఓట్ల నమోదు తప్పనిసరి అయింది. ప్రతి ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదును చేపట్టడం సాధారణం. ముఖ్యంగా గతంలో నమోదు చేసుకున్న ఓట్లు ఈ ఎన్నికలకు పరిగణించబడవు. ఈ క్రమంలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు కూడా పూర్తయింది. ఉపాధ్యాయ సంఘాలు పోటీపడి ఓటర్ల నమోదులో భాగమయ్యాయి. ఇటీవల కొత్తగా కల్పించిన అవకాశాలతో ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 49 పోలింగ్ కేంద్రాలుండగా 8,536 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్గర్ ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో పురుషులు 15,425 మంది, మహిళలు 14,074 మంది చొప్పున మొత్తం 30,191 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇతర జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 27 పోలింగ్ కేంద్రాల్లో 9,090 మంది, వికారాబాద్లో 1,969 మంది, మేడ్చల్-మల్కాజిగిరిలో 6,759 మంది, హైదరాబాద్లో 3,837 మంది ఓటర్లు ఉన్నారు.
నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు డిసెంబర్లో ముగిసింది. జిల్లాలో 1,804 మంది ఓటర్లు ఉన్నారు. 16న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం మార్చి 13న జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్