కోస్గి, నవంబర్ 24 : కర్ణాటకలో లేని గ్యారెంటీల ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలుచేస్తుందని భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలకేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లే ని విధంగా 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని అ న్నారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పది మందికి సేవచేయడం కోసం ఐదేండ్ల నుంచి నిత్యం అందుబాటులో ఉంటున్నాడన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మితే మోసపోవడం తప్పా వేరే దారి లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓటమి భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ సర్కారు గతంలో ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని వాటిని కూడా నెరవేర్చి దేశంలోనే నెంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.