జడ్చర్ల, నవంబర్ 5 : దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయిందని, ఈ ఎన్నికలలో ఒక్క సారిచాన్స్ ఇవ్వండని అ ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని 9వ వార్డు విజయనగర్ కాలనీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఆడబిడ్డలు రోడ్ల వెంబడి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వారన్నారు. నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఆడబిడ్డలు ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ఇంటింటికీ మంచినీళ్లను ఇచ్చారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వాదించాలన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికే మళ్లి పట్టం కట్టాలని, కారు గుర్తుకు ఓటువేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మహిళలు, వృద్ధులతో మాట్లాడారు. పింఛన్ సమయానికి వస్తుందా అని అంటూ వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు.
బాలానగర్, నవంబర్ 5 : బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని, రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఖాయమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వైస్ ఎంపీపీ వెంకటాచారితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు వట్టి బూటకమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు వైస్ ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ కల్యాణి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రవిజాదవ్, శంకర్నాయక్, వెంకట్రాములుగౌడ్, శ్రీనివాస్గౌడ్, కిషన్నాయక్, గణేశ్గౌడ్, సుధాకర్, లింగం పాల్గొన్నారు.
జడ్చర్ల, నవంబర్ 5 : తెలంగాణ ప్రభుత్వ ఆవిర్భావం తర్వాత జడ్చర్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తమకు సముచిత స్థానం కల్పించారని అందుకే ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి వెంటనే తా మంతా ఉంటామని ఆయనకే తమ మద్దతు ఉంటుందని బుడగజంగాల సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని బూరెడ్డిపల్లి వార్డులో బుడగజంగాల సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపుకోసం తామంతా పనిచేస్తామని ముక్తఖంఠంతో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీదప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బీదలు సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని అందుచేతనే వారి అభ్యునతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకంతో లబ్ధి చేకుతుందన్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గెలిపించాలని కోరారు.