మక్తల్టౌన్,అక్టోబర్ 24: విజయదశమి పండుగను సోమవారం మక్తల్ మండల వ్యాప్తంగా అన్నిగ్రామాల ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయాగ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయం త్రం శమీ పూజ చేశారు. విజయదశిమి వేడుకలను పురస్కరించుకొని బ్రాహ్మనవాడీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, సతీమణి సుచరితారెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. సాయంత్రం రామ్లీలా మైదానంలో నిర్వ హించిన శమీపూజలో ఎమ్మెల్యే చిట్టెం దం పతులు పాల్గొన్నారు. శమీపూజ అనంత రం రావణ దహన కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. రావణదహన కార్యక్రమం సందర్భంగా మక్తల్ పట్టణం యాదవ్నగర్ కాలనీకి చెందిన యువకులు స్థానిక వేణుగోపాలస్వామి దేవాలయం నుంచి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణాసుర వేష దారణతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ప్రజలు ఒకరికొకరు జమ్మి పత్రం ఇచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఊట్కూర్, అక్టోబర్ 24 : మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆర్యసమా జ్ ఆధ్వర్యంలో కాషాయ జెండా తో శోభయాత్ర నిర్వహించా రు. సాయంత్రం స్థానిక బసవన్న కట్ట వద్ద నిర్వంచిన కార్యక్ర మంలో వక్తలు పండుగ విషిష్టత గురించి ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లో పురోహితులు జమ్మి చెట్టుకు పూ జలు నిర్వహించా రు. అనంతరం ఒకరికొకరు జమ్మిపత్రాన్ని ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, ఆర్యసమాజ్ సభ్యులు బాలరాజ్ ఆర్య, పవన్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, పద్మారెడ్డి, నర్సింగప్ప, జ్ఞానేశ్వర్, భీంరావు, కేశవరావు, చందూలాల్, బిజ్వారం మహేశ్గౌడ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, అక్టోబర్ 24: మండలంలో దసరా పండుగను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆయా గ్రామా ల్లోని మండపాల్లో ప్రతిష్టించిన దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజ లు చేశారు. సాయం త్రం భజభజంత్రీలతో జమ్మిచెట్టుకు వద్ద ర్యాలీ గా వెళ్లి షమీ పూ జ చేసి ఒకరికొకరుపండుగ శుభకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం వివిధ కూల సం ఘాల పెద్దలు ఇంటింటికి తిరుగి వచ్చె నెల మూడో వారంలో మండల కేంద్రంలో నిర్వహించే బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆత్మకూరు, అక్టోబర్ 24: మండలంలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో దసరా వేడుకలను నిర్వహించా రు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రియాదవ్ దంపతులు శమీపూజ చేశారు. అనంతరం నిర్వహించిన రావణ సంహార కార్యక్రమం ఆకట్టుకున్నది. కార్యక్రమాల్లో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ గాడి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
నర్వ, అక్టోబర్ 24: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం దసరా పండగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆల యాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయం త్రం ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శమీ పూజ చేశారు. అనంతరం ఒకరికొకరు జమ్మి(బంగారం) ఇచ్చి పుచ్చుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కృష్ణ, అక్టోబర్ 24 : మండలంలో దసరా వేడుకలు మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని గురుజాల, హిందూపూర్, గుడెబల్లూర్ గ్రామాల్లో జెడ్పీటీసీ అంజనమ్మ పాటిల్, ఎంపీపీ పూర్ణిమపాటిల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు శుభకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.