పాలమూరు, అక్టోబర్ 24 : అత్యంత సుందరంగా నిర్మించిన ట్యాంక్బండ్ వద్ద దసరా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన దసరా ముగింపు వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముందుగా దసరా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి చెరువును పరిశీలించారు. సస్పెన్షన్ బ్రిడ్జి ద్వారా ఐలాండ్కు చేరుకొని జమ్మిచెట్టును నాటారు. ఆర్యసమాజ్ మందిరం వద్ద మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజధారి కండేకుమార్కు పూలమాల వేసి ఊరేగింపు ప్రారంభించారు. రాంమందిర్ చౌరస్తా, గడియారం చౌరస్తా మీదుగా ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఐలాండ్లో నాటిన జమ్మిచెట్టు వద్దకు ర్యాలీ కొనసాగింది. అక్కడ టపాకులు కాలి ఉత్సవాలను మరింత శోభయామానం చేశారు. ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేజీపై కళాకారులను భక్తీ సంగీత నృత్యా విభావరి ఎంతో ఆకట్టుకున్నది. పట్టణవాసులు పెద్దఎత్తున ట్యాంక్బండ్ వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
జిల్లా కేంద్రంలో మునుపెన్నడూ లేనివిధంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేపట్టినట్లు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో కులమత బేధాలు లేకుండా ప్రజలంతా శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందన్నారు. అంతకుముదు జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్పల్లి సమీపంలో ఉన్న గౌతమబుద్ద విహార్లో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాలకు మంత్రి అతిథిగా హాజరయ్యారు. అనంతరం గౌతమబుద్ద విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డా.మురళీధర్రావు, ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రకాశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కండెకుమార్, రాములు, రాజేశ్వర్, కేఎస్ రవికుమార్, లక్ష్మణ్, శివరాజ్, ప్రమోద్కుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్అర్బన్, అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారి చిత్రపటానికి పూజలు చేశారు.
మహబూబ్నగర్ 45వ వార్డు టీడీ గుట్ట, పాతతోటకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పవన్కుమార్, ప్రవీణ్, నరేశ్, మణికంఠ, చెన్నకేశవులు, నాగరాజు, శ్రీధర్, బాలకృష్ణయాదవ్, బాలామణి, లక్ష్మమ్మ, సాకలి లక్ష్మమ్మ, పూసల లక్ష్మమ్మ, సుశీలతోపాటు 100మందికి పైగా నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. అనంతరం మహబూబ్నగర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య ఫిబ్రవరి 16వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మల్లయ్య భార్య శాంతమ్మకు మంత్రి రూ.2లక్షల జీవితబీమా చెక్కును అందించారు. మహబూబ్నగర్ మండలం లాల్యానాయక్తండాకు చెందిన సంజు రచించిన ‘పాలమూరు ప్రగతి ప్రదాత’ పాటను మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు రాజేశ్వర్, సుదీప్రెడ్డి, రామకృష్ణ, పరమేశ్ పాల్గొన్నారు.