బిజినేపల్లి, మార్చి 25 : మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూ జలు చేశారు. అదేవిధంగా గ్రామంలో స్వయంభూగా వెలిసిన నారదగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా గో వింద నామస్మరణతో మార్మోగింది. వేంకటేశ్వరస్వామిని ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, నా గర్కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, ప్రతాప్రెడ్డి, నరేందర్రెడ్డి, చంద్రారెడ్డి, భాస్కరాచారి, శ్రీనుతోపాటు భక్తులు ఉన్నారు.