హన్వాడ, మార్చి 14 : దళితబంధు, రైతుబం ధు, రైతు బీమా వంటి పథకాలు ఆపడంతోపాటు పంటలు ఎండుతున్నా, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడమేనా మార్పు అంటే అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం మండలకేంద్రం లో దివంగత ఆశిరెడ్డి గురువు పాదుక పూజలో మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 700 ఎకరాలను ఆక్రమించుకున్నానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచందర్రెడ్డి ఆరోపిస్తున్నారని.. అది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని సవాల్ విసిరారు.
నిరూపితం కాకుంటే మీరేం చేస్తారో ప్రకటించాలన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.. నిరూపించడానికి ఎందుకు భయపడుతున్నారు.? ఎవరు అడ్డువస్తున్నారో చెప్పాలన్నారు. కొన్ని శక్తులు శ్రీనివాస్గౌడ్ వస్తే ప్రజల భూములు ఆక్రమించుకుంటారని దుష్ప్రచారం చేసి నన్ను ఓడించారన్నారు. కేవలం అబద్ధాలు, అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో మేం పదేండ్లు ఎంతో అభివృద్ధి చేశాం. మీరు మా కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తాం.. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. దళితుల భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు తీసుకోవద్దని, ఒక వేళ తీసుకుంటే దళితులకు అండగా నిలిచి వారి తరఫున పోరాటం చేస్తామని, అవసరమైతే నిరాహార దీక్షలు చేపడతామని శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
ఎంపీ మన్నె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ప్రజలకు మంచి చేసే వారిని ఎప్పుడూ ఆదరించాల ని సూచించారు. ఒకప్పుడు పాలమూరులో రోడ్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా అన్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండిన పంటలకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరా జు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు రమణారెడ్డి, జంబులయ్య, నాగన్న, న రేందర్, బాలయ్య, యాదయ్య, మన్నాన్, మోహ న్, అనంతరెడ్డి, మాధవులు, ఆంజనేయులు, నారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.