హన్వాడ, ఏప్రిల్ 15 : పాలమూరు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని, ఎంపీ గా మన్నె శ్రీనివాస్రెడ్డిని మళ్లీ గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హన్వాడలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, నేడు ఎంపీ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మ భ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని వాటిని న మ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో ఎటుచూసినా పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా.. గ్రామాల్లో ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నా ఈ ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నదని విమర్శించారు. రైతుబంధు సాయం రూ.15వేలు, కల్యాణలక్ష్మి సాయంతోపాటు తులం బంగారమని, ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అని చెప్పిన హా మీలన్నీ ఎక్కడ పోయాయని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు చెప్పి గెలుపొందాలని చూ స్తున్నాయని ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హన్వాడ మండలంలో రెండు బీసీ గురుకులాలతోపాటు ఎ స్సీ హాస్టల్ కూడా ఏర్పాటు చేశామని, మండలంలోని ఎంతో మందికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందించి ఆదుకున్నామని, ఎంపీ సైతం తన నిధుల నుంచి అభివృద్ధి పనులు చేశారని వివరించారు. మన ప్రభుత్వం లేకున్నా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చే స్తామని హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ను అమ్ముకున్న కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఎంపీగా నిలబడి తనను గెలిపించాలని కోరడం సిగ్గుచేటన్నారు. ఎవరికి ఏ ఒక్క రో జు సాయం చేసిన వ్యక్తి కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ నాన్లోకల్ క్యాండెట్లు అని.. మన్నె శ్రీనివాస్రెడ్డి లోకల్ అభ్యర్థి అని అన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడంతోపాటు తమ చేతగానితనాన్ని ఇతర పార్టీలపై రుద్దుతున్నదన్నారు. గొల్ల కురుమలు గొర్రెల కో సం డీడీలు కట్టినా.. గొర్రెల పంపిణీలో తా త్సారం ప్రదర్శిస్తున్నదన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, ప్రధాన క్యాదర్శి శివకుమార్, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్తోపాటు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.