గద్వాల, అక్టోబర్ 2 : సమైక్య పాలనలో కునారిల్లిని కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గొల్లకురుమలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడుత పంపిణీ విజయవంతం కాగా.. గొల్ల కురుమల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చింది. దీంతో మళ్లీ పంపిణీకి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే రెండో విడుత పంపిణీ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 8,833 యూనిట్ల అందజేతకు పశుసంవర్ధక శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో కాపరుల మోములో చిరుదరహాసం నెలకొన్నది.
కులవృత్తులకు తె లంగాణ ప్రభుత్వం జీవం పోస్తూ ఆర్థిక చేయూతనిస్తున్నది. గత పాలకుల హ యాంలో కులవృత్తులకు గుర్తింపు లేక ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో కులవృత్తులకు పునర్జీవం పోస్తూ ఆర్థికంగా లబ్ధి చేకూరేలా ప లు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రు. అందులో భాగంగా మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో ఉచితం గా చేపలు చేపపిల్లలు వదలడం, వలలు ఇవ్వడం, చేపలు విక్రయించేందుకు వా హనాలను సైతం ప్రభుత్వం సమకూర్చిం ది. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి లబ్ధిదారులకు రూ.10లక్షలు అందజేస్తున్నది. అదేవిధంగా బీసీ, మైనార్టీ బంధు ప్రవేశపెట్టి లబ్ధిదారులకు ఎలాంటి పూచీకత్తు లేకుం డా కులవృత్తిలో రాణించడానికి ఒక్కొక్కరికి రూ.లక్ష అందజేసింది.
ఇలా కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉండి వారు ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. ఈక్రమంలోనే గొల్లకురుమలు సైతం సగర్వంగా బతికేందుకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తూ అంతరించిపోతున్న కుల వృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోశారు. గొర్రెల పంపిణీతో గొర్రెలకాపర్ల ఇండ్లు మందలతో కళకళలాడుతున్నాయి. అంతరించిపోతున్న వృత్తులు బీఆర్ఎస్ సర్కా రు అందిస్తున్న పథకాలతో జీవం పోసుకున్నాయి. గొర్రెలు అందించడంతో జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఇతర రాష్ర్టాలకు వలసలు తగ్గిపోయాయి. మొదటి విడతలో జిల్లాలో 10,024 యూనిట్లను పశుసంవర్థకశాఖ అధికారులు విజయవంతంగా పంపిణీ చేసి రెండో విడతకు సంసిద్ధమయ్యారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 8,8 33 మందికి గొర్రెలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నా రు. ఇప్పటికే 540 యూనిట్లను పంపిణీ చేశారు. కాగా ఎలమంద పుణ్యమా అని గొల్లకురుమల జీవితం పూర్తిగా మారిపోయింది. జీవనోపాధి లేక రాయలసీమ, హైదరాబా ద్, కర్ణాటక రాష్ర్టానికి వల స పోయే గొర్రెలకాపర్లు ఇప్పుడు సొంత ఊళ్లోనే ఆర్థిక సంపదను సృష్టించుకుంటున్నారు. సబ్సిడీ గొర్రె ల పంపిణీకి ప్రభుత్వం 201 7 జూన్ 20న శ్రీకారం చుట్టిం ది. 18 ఏండ్లు దాటినా ఈ పథ కం దిగ్విజయంగా కొనసాగుతున్నది. జిల్లాలో 182 సొసైటీ లు ఉండగా వీటి ద్వా రా జిల్లాలో సుమారు 55వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
గతంలో పారదర్శకంగా..
గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని శాశ్వతంగా పారదోలాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గొర్రెలకాపర్లకు ప్రత్యేక పథకాలను రూపొందించింది. సొసైటీల ద్వారా మొదటి విడతలో 10,024మందిని గుర్తించి గొర్రెల యూనిట్లు పంపీణీ చేశారు. గతంలో ఒక్కో యూనిట్కు ప్రభుత్వం రూ.లక్షా 25వేలు ఖర్చు అవుతుండగా అందులో 75శాతం ప్రభుత్వమే భరించేది. ప్రస్తుతం యూనిట్ ధరను సర్కారు రూ.1.75లక్షలకు పెంచింది. దీంతో గతంలో లబ్ధిదారుడు రూ.31,250 తన వాటాగా చెల్లించగా ఇప్పుడు రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం రూ.93,750 చెల్లించగా నేడు రూ.1,31,250 ఇవ్వనున్నది. ఒక యూనిట్లో 20గొర్రెలు, ఒక పొట్టేలును అందిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.
కులవృత్తులకు సర్కారు చేయూత
మా ఇంట్లో నాతోపాటు నాభార్యకు కూడా సర్కారు గొర్లను అందించింది. ఇంతకుముందు నేను హమాలీగా పనిచేసేవాణ్ణి. నా భార్య వ్యవసాయ కూలి పనులకు వెళ్లేది. ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయడంతో హమాలీ పని వదిలి వాటిని పెంచుతున్నాం. ఇది మాకు మంచి సంపాదన. కేసీఆర్ సార్ తీసుకొచ్చిన ఈ పథకంతో మేము ఆర్థికంగా లాభం పొందే అవకాశం లభించింది. గొర్రెల సంఖ్య పెంచుకుంటూ ఆదాయాన్ని పొందడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వమే కులవృత్తులకు చేయూతనిచ్చింది. దీంతో మాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతున్నది. మాకోసం ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు గొల్లకురుమల తరఫున ఎప్పటికీ రుణపడి ఉంటాం.
పేదోళ్లకు ఎంతో మేలు..
కురుమలకు గొర్రెలు పంపిణీతో ఎంతోమంది పేదోళ్లలు ఆర్థికంగా మేలు కలుగుతున్నది. మా ఇంట్లో ఆరుగురికి గొర్లు అందాయి. ఈ గొర్లను మేమే స్వయంగా మేపుకొంటున్నాం. గతంలో వ్యవసాయం కూలీలుగా పనిచేసే వాళ్లం. ఆ పని వదిలి ఎలమందతో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం.