నాగర్కర్నూల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎ న్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాగర్కర్నూల్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి సి ట్టింగ్ ఎంపీ రాములుతోపాటు ఎ మ్మెల్యేలు, మాజీ మంత్రులు, మా జీ ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షు లు సహా ముఖ్య నాయకులు హైదరాబాద్ తెలంగాణ భవన్కు తరలివెళ్లనున్నారు. సిట్టింగ్ స్థా నాన్ని తిరిగి సాధించేలా ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు పార్లమెంట్స్థాయి సమీక్ష
నాగర్కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బు ధవారం జరుగనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నా రు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానంలో జోగుళాంబ గద్వాల, అలంపూర్, వనపర్తి నియోజకవర్గాలతోపాటుగా నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానంలో గత 2019ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి గెలిచిన పోతుగంటి రాములు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలిచేలా పార్టీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 3వ తేదీ నుంచి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్లమెంటరీస్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
ఈ సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితోపాటుగా జోగుళాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వ ల బాలరాజు, జైపాల్యాదవ్, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డితోపాటుగా నాగర్కర్నూల్, వనపర్తి జెడ్పీ ఛైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్విండో చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు సహా పలువురు ముఖ్య నాయకు లు హాజరు కానున్నారు. ఇటీవలి అసెం బ్లీ ఎన్నిక ల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో గద్వా ల, అలంపూర్ మినహా మిగిలిన ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభా వం పడకుండా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ వ్యూహాలు ఖరారు చే యనున్నారు.
ఈ ఎన్నికల్లో ఐదుచోట్ల బీఆర్ఎస్ ఓడినా పార్లమెంటరీ స్థాయిలో చూస్తే అంతరం చాలా తక్కువగానే ఉంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 38.20 శాతం ఓట్లను సాధించింది. అ దే కాంగ్రెస్కు 45.77ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ పరిధిలో మొత్తం 14,00,049 ఓట్లు పోలుకాగా కాంగ్రెస్కు 6,39,628ఓట్లు, బీఆర్ఎస్కు 5,34,401ఓట్లు రాగా బీజేపీకి 1,18, 513 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 1,05,227ఓట్ల ఆధిక్యత సాధించింది. ఇలా బీఆర్ఎస్కు కాంగ్రెస్తో కేవలం 8శాతంలోపే తక్కువగా ఉండటం గమనార్హం. గత ఎన్నికలో 50.8శాతంతో బీఆర్ఎస్కు 4,99,672 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 3.09లక్షలు, బీజేపీ నుంచి శృతికి కేవలం 1.29లక్షల ఓట్లే వచ్చాయి. ఇలా బీఆర్ఎస్ ఎంపీ రాములు 1,89,748 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.
కాంగ్రెస్ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మడంతో అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ ఐదు చోట్లా ఓడిపోవ డం గమనార్హం. దీనిపై నిరాశ చెందకుండా పార్టీ యంత్రాంగాన్ని కిందిస్థాయి వరకు సన్నద్ధత చేసేలా ఈ సమావేశంలో నిర్దేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ ముందుకు సాగేలా కేటీఆర్ భరోసా ఇవ్వనున్నారు. ఇటీవలే కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్ దాడిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొంటూ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకొనేలా ఈ సమావేశంలో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయను న్నారు.