మహబూబ్నగర్, జనవరి 17 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భా గంగా గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరి గే సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు తరలివెళ్తున్నా రు. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ సమీక్షా సమావేశాల్లో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మ న్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా పా ల్గొంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం నాగర్కర్నూల్ పార్లమెంట్ సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం అధికార పార్టీని ఇరుకున పెట్టే అంశాలను పరిశీలించి పోరాటానికి సమాయత్తం కావాలని కేటీఆర్ పిలుపునివ్వనున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసి వారికి భరోసా కల్పించే దిశగా నేత లు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ క్యాడర్ జారిపోకుండా కాపాడుతున్నారు. ఈ నే పథ్యంలో గురువారం జరిగే సమావేశం కీలకంగా మారనున్నది. ఈ సమావేశంతో అధికార పార్టీతోపాటు బీజేపీ నాయకుల గుండెల్లో దడ మొదలైంది.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం తెలంగాణ ఆవిర్భవించాక గులాబీ కంచుకోటగా మారింది. 2009లో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మహబూబ్నగర్ ఎంపీగానే ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణ ను సాధించారు. తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పదేండ్లపాటు ఉన్నారు. కేసీఆర్ వెంటే మహబూబ్నగర్ జిల్లా గులాబీ దళానికి కంచుకోటగా నిలిచింది. 2014, 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందించిన మహబూబ్నగర్ ప్రజలు ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తారనే ధీమా తో ఉన్నారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో సహా మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, ము న్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మా జీ కార్పొరేషన్ చైర్మన్లు సమావేశానికి హాజరుకానున్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలు పార్టీ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయని మహబూబ్నగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని, 45 రోజుల పాలనలోని అధికార పార్టీ విఫలమైందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్లో మరోసా రి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.