ఫోన్ పోయిందా.. అయితే దొరకదనే దిగులు పడే కాలం పోయింది. స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సాధారణ వస్తువుగా మొబైల్ మారింది. అంతగా మనిషికి దగ్గరైన ఫోన్ పొరపాటున పోయిందా.. అందులోని డేటా, ఫొటోలు ఎవరైనా చూస్తారనే ఆందోళన ఇకపై అక్కర్లేదు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)తో ఈజీగా కనిపెట్టొచ్చు. రోజురోజుకూ సాంకేతిక విప్లవం పెరుగుతుండడంతో కొత్త వెబ్సైట్ ఆధారంగా పోయిన ఫోన్లనూ గుర్తించొచ్చు. కనిపించని పోలీస్ మాదిరిగా దొంగలను ఇట్టే పట్టేయొచ్చు. ఈ సైట్పై పోలీస్ ఉన్నతాధికారులు వారి సిబ్బందికి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఫోన్లను కనిపెట్టి రికవరీ చేస్తుండడం సెల్ బాధితుల్లో సంతోషాన్ని నింపుతున్నది.
– నాగర్కర్నూల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్లో చెల్లించాలన్నా సెల్ఫోన్పైనే ఆధారప డాల్సి వస్తుంది. స్మార్ట్ఫోన్ లేనిదే పని కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సెల్ఫోన్ పోతే.. దాన్ని ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఈఐఆర్ ప్రత్యేక అప్లికేషన్ ద్వారా సెల్ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రత్యేక యాప్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
– నాగర్కర్నూల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)
దొంగతనాలు జరిగినప్పుడు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. నగలు, డబ్బులు పోయినదానికన్నా ఇప్పుడు ఫోన్లు పోతేనే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటున్నది. మా ట్లాడడం, ఫొటోలు దిగడం, సమాచారం కావాలంటే క్షణాల్లో వెబ్సైట్లలో తీసుకోవడం, డేటాను భద్రపరుచుకోవడంతోపాటు బ్యాంకింగ్ సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. ఇలా సెల్ఫోన్ ప్రజలకు ప్రధాన వస్తువుగా మారింది. ఒక్కొక్కరు రెండు ఫోన్లను సైతం వాడుతున్నారు. పరధ్యానం, తొందరపాటు, పని ఒత్తి డి, బైకులు, కార్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ చాలా మంది ఫోన్లు పోగొట్టుకుంటున్నారు. ఫోన్ దొరికిన వెంటనే క్షణాల్లో స్విచ్ఛాఫ్ చేసి మాయం చేస్తున్నారు. చేతిలో డ బ్బులు లేకున్నా ఫోన్ పే, గూగుల్, వాట్సాప్ వంటి యాప్ల ద్వారా చాయ్ తాగినా, టిఫిన్ చేసినా, హోటల్ బిల్లు క ట్టాలన్నా ఫోన్ బ్యాంకింగ్ యాప్లనే వాడుతున్నారు. పర్సనల్ ఫొటోలు, సమాచారం, తమ సంస్థల డేటాను భద్రపర్చుకుంటున్నారు. ఫోన్లు పోతే దాని ధర కంటే ముఖ్యంగా ఈ అంశాలే అధిక ప్ర భావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో పోయిన ఫోన్ తెచ్చుకోవాలంటే పోలీసు స్టేషన్లకు వెళ్లి, ఫిర్యాదులు చేయడం, అక్కడ నానా ప్రశ్నలు ఎదురవ్వడం, చివరికి ఆ ఫోన్ ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి.
పోలీసులు విరుగుడు కనిపెట్టారు. కనిపించ ని పోలీసుగా సీఐఈఆర్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెం ట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ప్రవేశపెట్టింది. ఫోన్లు చోరీకి గురైతే వెబ్సైట్లో లాగిన్ అయ్యి అందులో ఫోన్ వివరాలను నమోదు చేయాలి. ఇలా చేసిన క్షణాల్లోనే ఆ ఫోన్ పని చేయడం మానేస్తుం ది. అందులోని డేటా కూడా కనిపించదు. ఎవరైనా ఆ ఫోన్లో కొత్తగా సిమ్ వేసుకున్నా వెంటనే తెలుస్తుంది. ఈ విధానంపై పోలీసు శాఖ తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నది. జిల్లాల వారీగా ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది. ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భం గా మే 17న ఈ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పోలీసు శాఖ ప్రజలకు అవగాహన కల్పించే లా చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రజలకు తక్షణం లాభం చేకూరడంతోపాటు పోలీసులకూ భారం తప్పుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే పోయిన ఫోన్లను ప్రజలు తామే సొంతంగా కనిపెట్టేసుకోవచ్చు.
ఎలా పని చేస్తుంది..?
ఐఎంఈఐ నంబర్ తెలియకపోతే..
బ్లాక్ చేయండిలా..