మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18 : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తం కావాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో డీజీపీ మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో సమాజంలో భిన్నమైన నేరాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను సులభంగా మోసం చేస్తున్నారన్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు పోలీసు టెక్నికల్ విభాగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ శాఖల సమన్వయం, కంప్యూటర్ నిపుణుల సహా యంతో సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనంతరం ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సైబర్ నేరాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు జరిగే తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడి యా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నామన్నారు. పోలీసు కళాబృందం, విలేజ్ పోలీసు అధికారులు యువత, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లతో మోసపోయినవారు వెంటనే 1930 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వీసీలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, వెంకటరమణారెడ్డి, పోలీసు టెక్నికల్ బృందం తదితరులు పాల్గొన్నారు.