ఖిల్లాఘణపురం, ఆగస్టు 17 : చిన్న గ్రామపంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ముందరితండా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం గెజిట్ విడుదల చేయడంతో గురువారం తండావాసులు, బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు.
ఇందుకు కృషి చేసిన మంత్రి నిరంజన్రెడ్డిని 200 మంది నాయకులు, తండావాసులు హైదరాబాద్లో కలిసి శాలువాతో సన్మానించారు. 1,020 ఓట్లు ఉన్న ముందరితండాను జీపీగా ఏర్పాటు చేసేందుకు గెజిట్ విడుదల చే యడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మల్కిమియాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు తండాలను కలిపి జీపీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.