నాగర్కర్నూల్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధికి, స్థిరమైన రాజకీయాలకు ఎన్నికల ద్వారా నిరూపిస్తున్నారు. దీర్ఘకాలంపాటు నచ్చిన నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డిని ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. పలు శాఖలకు ఆయన మంత్రి గా పని చేశారు. ఆ తర్వాత వీఎన్గౌడ్ను మూడుసార్లు గెలిపిస్తే తాజాగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన గత 2014, 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన మర్రి జనార్దన్రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు తోడుగా ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేసిన సామూహిక వివాహాలు, తిమ్మాజిపేట, సిర్సవాడ, తాడూరులో కార్పొరేట్ స్థాయిలో తలపించేలా పాఠశాలల నిర్మాణాలు, రూ.5కే భోజనం, ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు, నిరుద్యోగ యువతకు గ్రూప్స్, పోలీసు, ఉపాధ్యాయ శిక్షణల్లాంటి సామాజిక సేవతో మర్రిని మరోసారి గెలిపించేలా ఉందని ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కందనూలు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడగా తొలిసారిగా ద్విసభ నియోజకవర్గంగా ఉండగా బ్రహ్మారెడ్డి(ఇండిపెండెంట్), రామస్వామి(ఇండిపెండెంట్) కాంగ్రెస్పై గెలుపొంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇక 1957 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కమలం గుర్తు ఖాతానే తెరవకపోగా కాంగ్రెస్, టీడీపీలు గెలుస్తూ రాగా తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు కందనూలు గడ్డ బలమైన అడ్డాగా మారింది. నియోజకవర్గం చరిత్రను చూస్తే తొలి నుంచి ఉన్న గోపాల్పేట మండలం వనపర్తిలోకి వెళ్లగా తిమ్మాజిపేట కొత్తగా చేరింది. నియోజకవర్గంలో నాగర్కర్నూల్, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాలు ఉనాయి. నియోజకవర్గంలో 2,24,631 మంది ఓటర్లు ఉండగా 259 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే గత 2018లో ఫలితాల్లో మర్రి జనార్దన్రెడ్డి తొలిసారిగా భారీగా 54,534 ఓట్ల తేడాతో గెలవగా 1983లో అత్యల్పంగా వీఎన్గౌడ్ కేవలం 52 ఓట్లతో గెలుపొందారు. ఎన్నికల్లో 48 శాతంగా ఉన్న బీసీలు ప్రభావితం చూపనున్నారు. కులాల వారీగా చూస్తే యా దవులు, ముదిరాజ్లు, ఎస్సీ ఓటర్లు అధిక శాతం ఉన్నారు. దళిత సామాజిక ఉద్యమ చైతన్యం ఈ ప్రాంతంలో అధికం. మొత్తం మీద కందనూలులో మరోసారి ప్రజలు స్థిరమైన రాజకీయాలకు అనుకూలమైన తీర్పు ఇవ్వబోతూ మర్రి వైపు మొగ్గు చూపుతారన్న రాజకీయ వర్గాల అంచనా..