కల్వకుర్తి, మార్చి 24 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాకు బోనస్గా రూ.500 ఇస్తామని రైతులకు హా మీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారం వచ్చిన వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా వరికి బోనస్పై ఉలుకు పలుకు లేదు. మరో వారం పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, బోనస్ ధరపై ఎటువంటి కా ర్యాచరణ ప్రకటించలేదు. రైతుబంధు విషయంలో పి ల్లిమొగ్గలు వేస్తున్న ప్రభుత్వం, బోనస్పై కూడా మంత్రులు తలో విధంగా మాట్లాడుతూ గందరగోళానికి తెరలేపుతారేమోనని అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్రధాన హామీలు రైతు భరోసా (పెట్టుబడి సాయం ఎకరానికి రూ.15వేలు), రు ణమాఫీ (రూ.2లక్షలు), ధాన్యానికి బోనస్ నీటి మీద రాతలుగా మిగిలిపోతాయా అన్న ప్రశ్నలు అన్నదాత మదిలో మెదులుతున్నాయి. రుణమాఫీలాగా కుంటిసాకులు వెతకకుండా వరిధాన్యం కొనుగోళ్లు చేసి రూ. 500 బోనస్పై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గత యాసంగిలో నాగర్కర్నూల్ జిల్లాలో 1.60 లక్ష ల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుబడి వచ్చింది. ఎంజీకేఎల్ఐ ద్వారా జిల్లాకు సాగునీరు అందడం, భూగర్భ జలాలు పైకి రావడంతో పెద్ద ఎత్తున వరిపంటను సాగుచేశారు. ధాన్యం దిగుబడిని అంచనా వేసినా కేసీఆర్ ప్ర భుత్వం వాటి కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మార్చి నుంచే కసరత్తులు ప్రారంభించింది. పీఏసీసీఎస్, మహిళా సంఘాల వంటి ఏజెన్సీలను అప్రమత్తం చేసింది. అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ధా న్యం దిగుబడి ప్రారంభం కాగానే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రైతుల కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నది.
ధాన్యం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇదంతా యుద్ద్ధప్రాతిపదికన జరిగింది. ప్రభుత్వం మారడంతో పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చినైట్లెందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది యాసంగిలో పెద్ద ఎత్తున వరి సాగుచేసిన రైతులు ఈ సారి పూర్తి స్థాయిలో సేద్యం చేయలేకపోయారు. డిసెంబర్ నెల మొదట్లోనే ఎంజీకేఎల్ఐ కాల్వ నీళ్లు బంద్ అయ్యాయి. ఈ ప్రభావంతో రైతులు ధాన్యాన్ని పెద్దగా సాగు చేయలేదు. కాల్వల నీళ్లు బంద్ కావడం, క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో సాగు చేసిన వరి పంటలకు నీళ్లు సరిపోలేని దుస్థితి నెలకొంది. నీళ్లు తక్కువ కావడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నది. దీనికి తోడు వాతావరణం సహకరించకపోవడంతో వరి పైరు ఏపు గా పెరగలేదు. ఈ యాసంగిలో జిల్లాలో వరి ధాన్యం దిగుబడి 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులు మించకపోవచ్చని రైతులు చెబుతున్నారు.
యాసంగిలో వరి సాగుచేసిన రైతులకు కష్టాలు ఎదురుకానున్నాయి. సాగునీరు సరిగ్గా లేకపోవడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గనున్నది. ఈ పరిస్థితుల్లో రా ష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడంతోపాటు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 500 బోనస్ ధర ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ వెంటనే ప్రా రంభించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చే స్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే ఖాతాల్లో బోనస్తో కూ డిన డబ్బు జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఐదు ఎకరాల్లో వరి సాగుచేశా. ఫిబ్రవరి ఆఖరు నుంచి బోరు బావుల్లో నీళ్లు తగ్గుతూ వచ్చాయి. ఏదో విధంగా వరిచేను ఎండిపోకుండా తడులు వేస్తున్నాను. మరో 10, 20 రోజుల్లో వరి పంట కోతకు వస్తుంది. ఈ సారి వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడం, నీళ్లు రాకపోవడంతో దిగుబడి చాలా తక్కువగా వస్తుందనిపిస్తుంది. ఇక భారమంతా ప్రభుత్వంపైనే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వరికి బోనస్ ఇస్తే రైతులకు కొంత మేలు జరుగుతుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.