ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 16 : కేసీఆర్ హయాంలో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీడుభూములకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పద్మశాలీ భవన్లో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి అభిలాష్రావుతో కలిసి మాజీ మంత్రి హాజరై మాట్లాడారు. వనపర్తి జిల్లాను సస్యశ్యామలం చేసి గణప సముద్రం, బుద్ధారం రిజర్వాయర్లను ప్రారంభించిన ఘనత కేసీఆర్దేనన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. పనులను తక్షణమే పూర్తిచేసి వచ్చే సీజన్లో సాగునీరు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందన్నారు. కేసీఆర్ హయాంలో పల్లెలన్నీ సస్యశ్యామలం అయ్యాయని, కాంగ్రెస్ రాగానే కరువుతో ప్రజలు గోస పడుతున్నారన్నారు. పదేండ్లలో తెలంగాణను కేసీఆర్ దేశంలోనే నంబర్వన్గా నిలిపితే.. కాంగ్రెస్ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ బలపర్చిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమా ర్ను దివ్యాంగులు, యువకులు శాలువాతో సన్మానించారు, సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు గట్టుయాదవ్, సీనియర్ నాయకురాలు ప్రత్యూష, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సా మ్యానాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.