నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాలకు 37యూనిట్లు పంపిణీ
వీపనగండ్ల, మే 22: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్నూల్ ఎం పీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాలకు 37యూనిట్లను ఆదివారం మండలకేంద్రంలో ఎంపీ, ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పాన్గల్ మండలానికి 14, చిన్నంబావికి 13, వీపనగండ్ల మండలానికి 10యూనిట్లు మొదటి విడుతలో మంజూరు చేశారు.
ఎక్కువ యూనిట్లు ట్రాక్టర్లు, కార్లు, బొలేరోలు, సౌండ్ బాక్స్లు పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్కు రూ.10లక్షల చొప్పున 37మందికి రూ.3.7కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులను విడుతల వారీగా ఎంపిక చేసి దళితుల ఆర్థికాభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గోపల్దిన్నే-సింగోటం రిజర్వాయర్కు లింక్ కెనాల్ ఏర్పాటుచేసి సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. మండల కేంద్రం నుంచి వెళ్తున్న రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకొని అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
అంతకుముందు మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రాం విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మాధూరి, వెంకట్రామమ్మ, ఎంపీపీ కమలేశ్వర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, తూంకుంట సింగిల్విండో చైర్మన్ రామన్గౌడ్, పార్టీ మండలాధ్యక్షులు సత్యనారాయణగౌడ్, ఈదన్న, సర్పంచులు నర్సింహారెడ్డి, విజయ్, రఘునాథ్రెడ్డి, రామేశ్వర్రావు, ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, దళితబంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.