బిజినేపల్లి ఏప్రిల్ 7: మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో యాసంగిలో వేసిన వరి పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. పెట్టుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రైతులు పంటలు పండించుకోవడానికి పుషలంగా నీరు దొరికేదని చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా రైతులు యాసంగిలో మొకజొన్న, వేరుశనగ, వరి పంటలను సాగు చేశారు. పంటలు కోతకు వచ్చే దశలో నీరు సక్రమంగా అందక వేసిన పం టలన్నీ ఎండుతున్నాయి.
లక్షలాది రూపాయ లు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు ఎం డిపోతుంటే, బోరుబావులు, ట్యాంకర్లు తదితర ప్రత్యామ్నాయాల ద్వారా తడులు అందించి పంటలు కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో సర్వే నిర్వహించి పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.