మక్తల్ టౌన్, మార్చి 14 : ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలు చేతికందే సమయంలో సాగునీరు లేకపోయింది. దీంతో చేసేది లేక రైతు లు పంటలను బీళ్లు పెట్టడం.. పశువులకు వదిలేయడం చేస్తున్నారు. మక్తల్కు చెందిన రైతు లక్ష్మీకాంత్రెడ్డి యాసంగిలో వరి సాగుచేశాడు. రెండు నెలలపాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో నీరు లేకపోవడంతో చేసేదేమీ లేక పంటను పశువుల మేతకు వదిలేశాడు. ఇలా మండలంలో ఎక్కడ చూసినా రై తుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. వానకాలం సరై న వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు, చెరువు లు, కాల్వల్లో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి.
దీంతో యాసంగిలో బోరు బావుల కింద పంటలు సాగు చేసినా అవి చే తికొచ్చే సమయంలో బోర్లు ఎండిపోవడంతో రై తులు పంటలు కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది రైతులు అప్పు లు చేసి బోర్లు వేసినా చుక్కనీరు పడడం లేదు. దీం తో పంటలకు పెట్టిన పెట్టుబడి, బోరు బావుల కో సం చేసిన అప్పులు తడిసి మోపడవుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ప్ర భుత్వం ఎండుతున్న పంటలను చూసైనా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.