కందనూలు, జూన్ 23 :వానకాలం సాగుకు రైతు సన్నద్ధమవుతున్నాడు. పొలాల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5 వేలు అందిస్తున్న తరుణంలో కర్షకులు వ్యవసాయాన్ని పండగలా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఎక్కువగా వాణిజ్య పంటలను పండించేందుకు రైతులు మొగ్గు చూపుతుండగా ప్రభుత్వం వారికి కావాల్సిన విత్తనాలు ఎరువులను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,28,521 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసమవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈసారి దిగుబడులు కూడా పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెరగనున్న సాగు విస్తీర్ణం..
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పంటలు సాగు విస్తీర్ణం బాగా పెరిగిం ది. గతేడాది పత్తి 3,30,5 77 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 3,63, 635 ఎకరాల్లో సాగు అంచనా వేశారు. వరి గతేడాది 1,23,019 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 1,29, 170 ఎకరాల్లో సా గు అంచనా వేశారు. మొక్కజొన్న గతేడాది 31,972 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 90,611ఎకరాల్లో సా గు చేయనున్నారు. జొన్న గతేడాది 2,096 ఎకరాల్లో సాగు చేయగా 2,515 సాగు అంచనా వేశారు.
ఎరువులు సిద్ధం..
జిల్లా వ్యాప్తంగా 1,28,521 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. యూరియా 65,493 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 10,328 మెట్రిక్ ట న్నులు అందుబాటులో ఉందని , గతేడాది 20,890 మెట్రిక్ టన్నులు వినియోగించారు. డీఏపీ 18,138 మెట్రిక్టన్నులు అంచనా వే యగా 2,814 మెట్రిక్టన్నులు అందుబాటు లో ఉండగా గతేడాది 7,160 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఎంవోపీ 3,865 మెట్రిక్ టన్నులు అంచనా వేయగా 489 మెట్రిక్ ట న్నులు అందుబాటులో ఉండగా, గతేడాది 850 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఎస్ఎస్పీ 2286 మెట్రిక్ టన్నులు అంచనా వేయగా 489 మెట్రిక్ టన్నులు అందుబాటు లో ఉండగా , గతేడాది 960 మెట్రిక్ టన్నులు వినియోగించారు. కాంప్లెక్స్ 38,7 39 మెట్రిక్టన్నులు అంచనా వేయగా 3,223 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా , గతేడాది 24,560 మెట్రిక్ టన్నులు వినియోగించారు.
పెరిగిన భూగర్భ జలాలు..
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం తో చెరువులు, కుంటల్లో పూడిక తీయడంతో నీటి నిల్వ శాతం పెరిగి భూగర్భజలాలు భారీ గా పెరిగాయి. జిల్లాలో ఎక్కువ శాతం వర్షంపై ఆధారపడి రైతులు సాగు చేస్తుండగా భూగర్భ జలాలు కూడా పెరగడంతో రైతులకు నీటి కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా కేఎల్ఐ ద్వారా కాల్వల్లో నీరు పారుతుండడంతో రైతులకు ఆసరా అయ్యింది. మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.